News October 7, 2025
10 వీక్లీ స్పెషల్ ట్రైన్ల టర్మీనల్ మార్పు

తిరుపతి రైల్వే స్టేషన్ వరకు నడిచే పది ట్రైన్స్ టెర్మినల్స్ను దక్షిణ మధ్య రైల్వే మార్పు చేసింది. వీక్లీ స్పెషల్ కింద నడిచే పది ట్రైన్స్ తిరుచానూరు స్టేషన్ వరకు నడవనున్నాయి. 07609, 07610, 07251, 07252, 07015, 07016, 07009, 07010, 07017, 07018 ట్రైన్స్ ఇకపై తిరుచానూరు స్టేషన్ నుంచి నడవనున్నాయి.
Similar News
News October 7, 2025
జిల్లా ప్రజలకు ఎస్పీ సూచనలు..!

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బీ ఉమామహేశ్వర్ మంగళవారం పలు సూచనలు చేశారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లను నమ్మవద్దన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. అధికారిక యాప్లను మాత్రమే డౌన్లోడ్ చేసుకుని, వాటికి స్ట్రాంగ్ పాస్వర్డ్ ఉపయోగించాలని పేర్కొన్నారు.
News October 7, 2025
రోహిత్, కోహ్లీని ఎందుకు సెలక్ట్ చేశారో: మాజీ కెప్టెన్

వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ను తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘AUS టూర్కు రోహిత్, కోహ్లీని ఎందుకు సెలక్ట్ చేశారో? లాంగ్ బ్రేక్ కారణంగా వారి ఫామ్, ఫిట్నెస్ అంచనా వేయడం కష్టం. కేవలం రికార్డులు చూసి ఎంపిక చేసినట్లున్నారు. సెలక్టర్లు ఆలోచించాల్సింది’ అని వ్యాఖ్యానించారు. అటు కెప్టెన్గా గిల్ను ఎంపిక చేయడాన్ని సమర్థించారు.
News October 7, 2025
AIలో సత్తా చాటి.. PM చేతుల మీదుగా అవార్డు

ఖమ్మం జిల్లాకు చెందిన తాళ్లూరి పల్లవి AI ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్గా ఎంపికై ప్రధాని చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. యువతలో స్కిల్డెవలప్మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు PM-SETU పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. పల్లవి AI న్యూట్రిషన్ అసిస్టెంట్ను తయారు చేశారు. వ్యక్తిగత డైట్ను అందించడంలో ఇది సహకరిస్తుంది.