News October 7, 2025

పార్వతీపురం నుంచి 30 ప్రత్యేక బస్సులు

image

విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర సందర్బంగా పార్వతీపురం జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు సేవలందిస్తున్నాయి. జిల్లా నుంచి 30 బస్సులు ఏర్పాటు చేసినట్లు RTC అధికారులు తెలిపారు. పార్వతీపురం డిపో నుంచి 10 బస్సులు, పాలకొండ నుంచి 12, సాలూరు డిపో నుంచి 8 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో గతేడాది కంటే 6 బస్సులు అదనంగా ఏర్పాటు చేశామని మంగళవారం ఉదయం నుంచే సేవలందిస్తున్నాయన్నారు.

Similar News

News October 7, 2025

జిల్లా ప్రజలకు ఎస్పీ సూచనలు..!

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బీ ఉమామహేశ్వర్ మంగళవారం పలు సూచనలు చేశారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. అధికారిక యాప్‌లను మాత్రమే డౌన్లోడ్ చేసుకుని, వాటికి స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఉపయోగించాలని పేర్కొన్నారు.

News October 7, 2025

రోహిత్, కోహ్లీని ఎందుకు సెలక్ట్ చేశారో: మాజీ కెప్టెన్

image

వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘AUS టూర్‌కు రోహిత్, కోహ్లీని ఎందుకు సెలక్ట్ చేశారో? లాంగ్ బ్రేక్ కారణంగా వారి ఫామ్, ఫిట్‌నెస్ అంచనా వేయడం కష్టం. కేవలం రికార్డులు చూసి ఎంపిక చేసినట్లున్నారు. సెలక్టర్లు ఆలోచించాల్సింది’ అని వ్యాఖ్యానించారు. అటు కెప్టెన్‌గా గిల్‌ను ఎంపిక చేయడాన్ని సమర్థించారు.

News October 7, 2025

AIలో సత్తా చాటి.. PM చేతుల మీదుగా అవార్డు

image

ఖమ్మం జిల్లాకు చెందిన తాళ్లూరి పల్లవి AI ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టాపర్‌గా ఎంపికై ప్రధాని చేతులమీదుగా అవార్డును అందుకున్నారు. యువతలో స్కిల్‌డెవలప్‌మెంట్, ఉద్యోగ నైపుణ్యాల్ని పెంచేందుకు PM-SETU పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో భాగంగా అత్యుత్తమ నైపుణ్యం కనపరిచిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. పల్లవి AI న్యూట్రిషన్ అసిస్టెంట్‌ను తయారు చేశారు. వ్యక్తిగత డైట్‌ను అందించడంలో ఇది సహకరిస్తుంది.