News October 7, 2025
పైడితల్లి అమ్మవారి దివ్యగాథ

విజయనగరానికి రాజైన తన సోదరుడు విజయరామరాజును బొబ్బిలి యుద్ధానికి వెళ్లొద్దని పైడితల్లమ్మ ముందే చెబుతారు. కానీ ఆమె మాట వినక రాజు యుద్ధానికెళ్లి మరణిస్తాడు. ఈ కబురు తెలిసి అమ్మవారు కూడా తనువు చాలిస్తారు. అదే రాత్రి పతివాడ అప్పలనాయుడు కలలోకి వచ్చిన అమ్మవారు తన ప్రతిరూపాలు లభించే స్థలాన్ని సూచిస్తారు. వాటిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించమని చెబుతారు. ఆ విగ్రహాలు నిజంగానే లభ్యమవ్వగా, ఆలయాన్ని నిర్మించారు.
Similar News
News March 7, 2026
ఇరాన్ యుద్ధంతో ఇండియన్ ఎకానమీకి ముప్పే: SBI రీసెర్చ్

పశ్చిమాసియాలో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఇండియా గ్రోత్ రేట్ నెమ్మదిస్తుందని SBI రీసెర్చ్ వెల్లడించింది. ‘క్రూడాయిల్ ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరిగి GDP వృద్ధి 0.25% వరకు తగ్గొచ్చు. హార్ముజ్ ద్వారా జరిగే చమురు సరఫరాకు ఆటంకం కలిగితే దిగుమతి ఖర్చులు భారమవుతాయి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే డబ్బు, ట్రేడ్పై కూడా ప్రభావం ఉంటుంది. ఇది దేశ ఎకానమిక్ స్టెబిలిటీకి ఛాలెంజింగ్గా మారుతుంది’ అని హెచ్చరించింది.
News March 7, 2026
కల్తీ పాలు.. 10కి చేరిన మరణాలు

AP: రాజమండ్రి కల్తీ <<19289956>>పాల ఘటనలో<<>> మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ అనంతలక్ష్మి(72) అనే మహిళ చనిపోవడంతో మృతుల సంఖ్య 10కి చేరింది. తీవ్ర అనారోగ్యంపాలైన ముగ్గురు చిన్నారులు సహా 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురికి వెంటిలేటర్పై డయాలసిస్ చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
News March 7, 2026
‘గద్దర్’ అవార్డులపై నాగ్ ప్రశంసలు

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ‘గద్దర్ అవార్డ్స్’ విజేతలకు అక్కినేని నాగార్జున శుభాకాంక్షలు తెలియజేశారు. తన తండ్రి ANR పేరిట అవార్డును ఇచ్చినందుకు CM రేవంత్ రెడ్డి, Dy.CM భట్టిలకు ధన్యవాదాలు తెలిపారు. ANR అవార్డు పొందిన జయసుధకు, NTR అవార్డు గ్రహీత చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్న తన కుమారుడు నాగచైతన్యను ‘దుల్ల కొట్టావ్ నాన్న’ అంటూ ప్రత్యేకంగా ప్రశంసించారు.


