News October 7, 2025

పైడితల్లి అమ్మవారి దివ్యగాథ

image

విజయనగరానికి రాజైన తన సోదరుడు విజయరామరాజును బొబ్బిలి యుద్ధానికి వెళ్లొద్దని పైడితల్లమ్మ ముందే చెబుతారు. కానీ ఆమె మాట వినక రాజు యుద్ధానికెళ్లి మరణిస్తాడు. ఈ కబురు తెలిసి అమ్మవారు కూడా తనువు చాలిస్తారు. అదే రాత్రి పతివాడ అప్పలనాయుడు కలలోకి వచ్చిన అమ్మవారు తన ప్రతిరూపాలు లభించే స్థలాన్ని సూచిస్తారు. వాటిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించమని చెబుతారు. ఆ విగ్రహాలు నిజంగానే లభ్యమవ్వగా, ఆలయాన్ని నిర్మించారు.

Similar News

News October 7, 2025

కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి విటమిన్ D

image

గర్భస్థ శిశువు ఆరోగ్యానికి విటమిన్ D ఎంతో అవసరమంటున్నారు పరిశోధకులు. ఫీటల్‌ స్కెలిటన్‌ గ్రోత్, ప్లాసెంటా, తల్లి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు D విటమిన్‌ తగినంత ఉండాలని చెబుతున్నారు పెన్‌‌స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు. లేదంటే నెలలు నిండకుండా పుట్టడం, ఫీటల్‌ లెంత్‌ తక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>

News October 7, 2025

కన్నడ ‘బిగ్‌బాస్‌’కు షాక్.. నిలిచిపోయిన షో

image

కన్నడ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ షో నిలిచిపోయింది. కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(KSPCB) నోటీసులతో మేకర్స్ షూటింగ్ నిలిపేశారు. షూటింగ్ జరుగుతున్న జాలీవుడ్ స్టూడియోస్‌లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని యాక్టివిస్టులు ఆందోళన చేయడంతో KSPCB చర్యలు తీసుకుంది. స్టూడియో నుంచి వస్తున్న కలుషిత నీటితో స్థానిక ఎకోసిస్టం దెబ్బతింటోందని పేర్కొంది.

News October 7, 2025

కనకాంబరం పూల సేకరణకు అనువైన సమయం ఏది?

image

తెలుగు రాష్ట్రాల్లో కనకాంబరం సాగు పెరిగింది. ఈ మొక్కలు నాటిన 2 నుంచి 3 నెలలకు పూత ప్రారంభమై, ఏడాది పొడవునా పూలు పూస్తాయి. జూన్ నుంచి జనవరి వరకు దిగుబడి ఎక్కువగా, వర్షాకాలంలో దిగుబడి కొద్దిగా తగ్గుతుంది. కనకాంబరం పూలను సరైన సమయంలో సేకరిస్తే అవి తాజాగా ఉండి మంచి ధర వస్తుంది. కనకాంబరం పూర్తిగా విచ్చుకోవడానికి రెండు రోజులు పడుతుంది. కాబట్టి రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పూలు కోయాలి.