News October 7, 2025
JGTL: నిరుపేద విద్యార్థులకు భారంగా మారిన విద్య

JGTL పట్టణంలోని శ్రీ చైతన్య జాబితాపూర్, చుక్కారామయ్య సహా పలు ప్రభుత్వ పాఠశాలల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీం ద్వారా పేద విద్యార్థులకు విద్యనందిస్తున్నారు. కాగా, ప్రభుత్వం నుంచి అందాల్సిన ఫీజుల బిల్లులు రాలేదని విద్యార్థులను లోపలికి రానీయకుండా బయటికు పంపేశారు. కలెక్టరేట్కు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లినా తిరస్కరించారని, రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.
Similar News
News October 7, 2025
ములుగు: ప్రశ్నార్థకంగా ‘మావో’ల గమ్యం..!

పీడత ప్రజలు, సమసమాజ స్థాపన కోసం అడవిబాట పట్టిన అన్నల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వరుస ఎన్కౌంటర్లు, అగ్ర నేతల మృత్యువాతతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా వందల సంఖ్యలో మావోయిస్టులు, కీలక నేతల లొంగుబాట్లు, పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ఎటూ పాలుపోనీ పరిస్థితి నెలకొంది. మరోవైపు 2026 మార్చి 31కి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 7, 2025
రాజమండ్రిలో వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా

ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ కీర్తి చేకూరి ఆరా తీశారు. మంగళవారం ఆమె రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. పలు వార్డులు, పరికరాలు, రికార్డులు పరిశీలించారు. మందుల నిల్వలు, పరిక్షల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలన్నారు. పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.
News October 7, 2025
‘SIR’ ఎన్నికల కమిషన్ విశేషాధికారం: SC

బిహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ఎన్నికల కమిషన్ విశేషాధికారమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో జోక్యం చేసుకోలేమని విచారణ సందర్భంగా పేర్కొంది. అందరి విధుల్లో తాము జోక్యం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారని పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు బిహార్లో ఫైనల్ ఓటర్ లిస్ట్ను ప్రకటించినట్లు కోర్టుకు EC తెలిపింది. రాజకీయ నాయకులే అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని వివరించింది.