News October 7, 2025

పీలేరులో పతాకస్థాయికి MLA పీఏ భూకబ్జాలు: YCP

image

పీలేరు <<17935208>>MLA కిషోర్ కుమార్ పీఏ<<>> సత్య తన భూమిని కబ్జా చేశారని అనురాధ అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరవర్గం భారీగా కబ్జాలు చేస్తోంది. పీలేరులో ఎమ్మెల్యే పీఏ భూకబ్జాలు పతాకస్థాయికి చేరాయి. ఈ 15 నెలల్లో ఇసుక, లిక్కర్‌లో దోచుకుంది మీ వాళ్లకి సరిపోలేదా చంద్రబాబు?’ అంటూ YCP ట్వీట్ చేసింది.

Similar News

News October 7, 2025

ములుగు: ప్రశ్నార్థకంగా ‘మావో’ల గమ్యం..!

image

పీడత ప్రజలు, సమసమాజ స్థాపన కోసం అడవిబాట పట్టిన అన్నల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వరుస ఎన్కౌంటర్లు, అగ్ర నేతల మృత్యువాతతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా వందల సంఖ్యలో మావోయిస్టులు, కీలక నేతల లొంగుబాట్లు, పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ఎటూ పాలుపోనీ పరిస్థితి నెలకొంది. మరోవైపు 2026 మార్చి 31కి మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 7, 2025

రాజమండ్రిలో వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ ఆరా

image

ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై కలెక్టర్ కీర్తి చేకూరి ఆరా తీశారు. మంగళవారం ఆమె రాజమండ్రిలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. పలు వార్డులు, పరికరాలు, రికార్డులు పరిశీలించారు. మందుల నిల్వలు, పరిక్షల నిర్వహణ, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను మెరుగుపరచాలన్నారు. పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు.

News October 7, 2025

‘SIR’ ఎన్నికల కమిషన్ విశేషాధికారం: SC

image

బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ఎన్నికల కమిషన్ విశేషాధికారమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో జోక్యం చేసుకోలేమని విచారణ సందర్భంగా పేర్కొంది. అందరి విధుల్లో తాము జోక్యం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారని పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు బిహార్‌లో ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను ప్రకటించినట్లు కోర్టుకు EC తెలిపింది. రాజకీయ నాయకులే అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని వివరించింది.