News October 7, 2025
పీలేరులో పతాకస్థాయికి MLA పీఏ భూకబ్జాలు: YCP

పీలేరు <<17935208>>MLA కిషోర్ కుమార్ పీఏ<<>> సత్య తన భూమిని కబ్జా చేశారని అనురాధ అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరవర్గం భారీగా కబ్జాలు చేస్తోంది. పీలేరులో ఎమ్మెల్యే పీఏ భూకబ్జాలు పతాకస్థాయికి చేరాయి. ఈ 15 నెలల్లో ఇసుక, లిక్కర్లో దోచుకుంది మీ వాళ్లకి సరిపోలేదా చంద్రబాబు?’ అంటూ YCP ట్వీట్ చేసింది.
Similar News
News March 7, 2026
భారీగా పెరిగిన సిలిండర్ ధరలు

వంట గ్యాస్, కమర్షియల్ LPG సిలిండర్ ధరలను కేంద్రం భారీగా పెంచింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్పై 60 రూపాయలు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై ₹115 పెంచింది. ఈ కొత్త ధరలు ఈరోజు నుంచే అమలులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్లో 14.2kg డొమెస్టిక్ సిలిండర్ ధర ₹905 నుంచి ₹965కు, 19kg కమర్షియల్ సిలిండర్ ధర ₹1,961 నుంచి ₹2,076కు చేరింది.
News March 7, 2026
మూడు రోజులు బయటికి రావొద్దు: వైద్యులు

TG: నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రంలో విపరీతమైన ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అప్రమత్తంగా ప్రజలు ఉండాలని వైద్యారోగ్య శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా.రవీందర్ నాయక్ సూచించారు. దాహం వేయకపోయినా తరచూ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తీసుకుంటూ డీహైడ్రేట్ బారినపడకుండా జాగ్రత్త పడాలన్నారు.
News March 7, 2026
కర్నూలు: కాలేజీకి రాకుండానే పరీక్షలు.. బీఈడీ కాలేజీల దందా!

కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, హోళగుందలోని పలు బీఈడీ కాలేజీలు బ్లాక్ టీచింగ్ నిర్వహించకుండా నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలేజీకి రాకుండానే పరీక్షలు రాసేలా యాజమాన్యాలు విద్యార్థులతో ఒప్పందాలు కుదుర్చుకొని భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. RJD స్థాయిలో విచారణ జరిపి నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాలేజీల అనుమతులు రద్దు చేయాలని DSF విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తోంది.


