News October 7, 2025
పీలేరులో పతాకస్థాయికి MLA పీఏ భూకబ్జాలు: YCP

పీలేరు <<17935208>>MLA కిషోర్ కుమార్ పీఏ<<>> సత్య తన భూమిని కబ్జా చేశారని అనురాధ అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరవర్గం భారీగా కబ్జాలు చేస్తోంది. పీలేరులో ఎమ్మెల్యే పీఏ భూకబ్జాలు పతాకస్థాయికి చేరాయి. ఈ 15 నెలల్లో ఇసుక, లిక్కర్లో దోచుకుంది మీ వాళ్లకి సరిపోలేదా చంద్రబాబు?’ అంటూ YCP ట్వీట్ చేసింది.
Similar News
News March 14, 2026
వికారాబాద్: టెన్త్ విద్యార్థులకు అలర్ట్

జిల్లాలో 69 పరీక్షా కేంద్రాల్లో 13,514 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్ష రాయన్నారు. బాలురు 6,740 మంది, బాలికలు 6774మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు ఉ.9:30 నుంచి మ.12:30 వరకు నిర్వహించనున్నారు. 9:30నిమిషాలకు పరీక్ష ప్రారంభం అవ్వనుండగా ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు.
News March 14, 2026
కామారెడ్డి: పది పరీక్షలకు 13,154 మంది విద్యార్థులు

జిల్లాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 13,154 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు డీఈవో రాజు తెలిపారు. వీరిలో 6,451 మంది బాలురు, 6,703 మంది బాలికలు ఉన్నారు. మొత్తం 65 పరీక్షా కేంద్రాలు, 65 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులతో పాటు 739 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు ఆయన వివరించారు.
News March 14, 2026
HYD: 600 ఎకరాల భూమి వేలం!

బడ్జెట్లో నిధుల లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం నగర శివార్లలోని ప్రభుత్వ భూములను విక్రయించేందుకు సిద్ధమైంది. కోకాపేట, బుద్వేల్ తర్వాత ఇప్పుడు ‘కిస్మత్పూర్’, ‘తారామతి-బారామతి’ పరిసరాల్లో సుమారు 600 ఎకరాల వివాదరహిత భూములను వేలం వేయాలని క్యాబినెట్ రహస్యంగా నిర్ణయించింది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. కనీసం ₹15,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.


