News October 7, 2025
జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ?

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి టీడీపీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు ఓకే చెబితే నందమూరి హరికృష్ణ కూతురు, జూనియర్ ఎన్టీఆర్ సోదరి సుహాసినిని అభ్యర్థిగా నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిలో భాగంగా నేడు సాయంత్రం తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు ఉండవల్లి నివాసంలో భేటీ కానున్నారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ నేతలతో చంద్రబాబు ఈ ప్రతిపాదన చేయనున్నారు.
Similar News
News October 7, 2025
హైదరాబాద్లో భారీ వర్షం

మహానగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. నాంపల్లి, అబిడ్స్, హిమాయత్నగర్, బర్కత్పురా, నల్లకుంట, కోఠి, కాచిగూడ ప్రాంతాల్లో భారీ వాన పడుతోంది. అటు యాదాద్రి, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, MBNR, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, RR, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లోనూ రానున్న 2 గంటల్లో వర్షం కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మీ ఏరియాలో వాన పడుతోందా?
News October 7, 2025
బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ, జేడీయూకి సమాన సీట్లు!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల కసరత్తు జరుగుతోంది. మొత్తం 243 సీట్లలో 205 చోట్ల ఇరు పార్టీలు సమాన స్థానాల్లో బరిలో దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 38 సీట్లు NDAలోని LJP, HAM, RLMలకు ఖరారయ్యే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసి అధికారం చేపట్టాయి. ఇక బిహార్ ఎన్నికలు NOV 6, 11న జరగనుండగా 14న ఫలితాలు వెలువడతాయి.
News October 7, 2025
‘SIR’ ఎన్నికల కమిషన్ విశేషాధికారం: SC

బిహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ఎన్నికల కమిషన్ విశేషాధికారమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో జోక్యం చేసుకోలేమని విచారణ సందర్భంగా పేర్కొంది. అందరి విధుల్లో తాము జోక్యం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారని పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు బిహార్లో ఫైనల్ ఓటర్ లిస్ట్ను ప్రకటించినట్లు కోర్టుకు EC తెలిపింది. రాజకీయ నాయకులే అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని వివరించింది.