News October 7, 2025
HYD: హెచ్ఎండీఏకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చిన హైకోర్టు

గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణాలకు అనుమతిస్తూ గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాము అనే వ్యక్తి దీనిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కౌంటర్ దాఖలుకు హెచ్ఎండీఏ పలు వాయిదాలు తీసుకుంది. దీంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ లాస్ట్ ఛాన్స్గా రెండు వారాలు గడువు ఇచ్చింది. ఈలోపు కౌంటర్ దాఖలు చేయకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
Similar News
News October 7, 2025
కల్తీ మద్యానికి కర్త, కర్మ, క్రియ అంతా జగనే: పీతల సుజాత

పురాణాల్లో దేవుళ్లు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్టు, సీఎం చంద్రబాబు మంచి పనులు చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నాడని ఏపీ డబ్ల్యూసీఎఫ్సీ ఛైర్మన్ పీతల సుజాత మండిపడ్డారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
News October 7, 2025
ASF: పశువులను రోడ్లపై వదిలితే చర్యలు

ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ రోడ్లపైకి పశువులను వదిలే యజమానులకు సూచనలు చేశారు. పశువులను రాత్రిపూట, పగటిపూట రోడ్లపైన వదలకుండా చూసుకోవాలన్నారు. పశువులను రోడ్ల పైన వదలడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. యజమానులు పశువులను వారి సంరక్షణలో ఉంచుకోవాలని లేని పక్షంలో జరిమానాలు విధించడంతో పాటు పురపాలక చట్టం 2019 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 7, 2025
సిద్దిపేట: RRR భూసేకరణపై జిల్లా కలెక్టర్ సమీక్ష

సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో రీజనల్ రింగ్ రోడ్డు భూ సేకరణ ప్రక్రియ గూర్చి రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా మండలాల వారిగా భూ సేకరణ వివరాల గూర్చి రెవెన్యూ అధికారులతో చర్చించి ఆయా గ్రామాల వారిగా ఒక పక్క ప్రణాళికతో భూ సేకరణ వేగవంతం చెయ్యాలని ఆదేశించారు.