News October 7, 2025

ధర్మపురి: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

JGTL(D) ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన బగ్గి లక్ష్మి(50)రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 5న నక్కలపేటలో రోడ్డుపై నడుస్తుండగా బుగ్గారం గ్రామానికి చెందిన రాజశేఖర్ అతివేగంగా కారు నడుపుతూ లక్ష్మిని ఢీ కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను JGTL ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మరణించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI ఉదయ్‌కుమార్ తెలిపారు.

Similar News

News March 17, 2026

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభం

image

తెలంగాణలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెగ్యులర్ ధరలతో టికెట్లు అందుబాటులో ఉండటంతో ధరల పెంపు లేనట్లేనని తెలుస్తోంది. ఈ నెల 19న ఉ.7.30 గంటలకు మొదటి షో పడనుంది. కాగా ఏపీలో టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం <<19374694>>అనుమతినిచ్చిన<<>> సంగతి తెలిసిందే. అక్కడ ఉ.4 గంటలకు బెనిఫిట్ షో పడనుంది.

News March 17, 2026

దోర్నాల: ఈనెల 16 నుంచి 20 వరకు గేట్లు ఓపెన్

image

శ్రీశైలంలో ఇవాళ్టి నుంచి ఉగాది బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ దోర్నాల గణపతి చెక్ పోస్ట్ నుంచి రాత్రి వేళల్లో కూడా శ్రీశైలం వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇవాళ రాత్రి వేళల్లో కూడా వాహనాలు శ్రీశైలానికి వెళ్తున్నాయి. భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈనెల 16 నుంచి 20 వరకు అటవీ శాఖ నిబంధనలు పాటిస్తూ వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 17, 2026

జగిత్యాలలో పసుపు క్వింటాల్ రూ. 11,500

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పసుపు(పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠ రూ.11,500, కనిష్ఠం రూ. 8,000, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం రూ. 10,000, కనిష్ఠం రూ. 7,000, మక్కలు గరిష్ఠం రూ. 1,791, కనిష్ఠం రూ. 1,521, కందులు గరిష్ఠం రూ. 6,911, కనిష్ఠం రూ. 5,636, పెసర్లు రూ. 7,250, అనుములు గరిష్ఠం రూ. 4,556, కనిష్ఠం రూ. 3,000, వరి (JSR) గరిష్ఠం రూ. 2,601, కనిష్ఠం రూ. 1,755గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.