News October 7, 2025

నిర్మల్‌: చెరువులో దూకి ఇద్దరు అన్నదమ్ముల మృతి

image

ఇద్దరు అన్నదమ్ములు చెరువులో పడి మృతి చెందిన ఘటన నిర్మల్ బంగల్పేట్ చెరువులో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన నరేష్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తమ్ముడు నవీన్ కాపాడడానికి వెళ్లాడు. దీంతో ఇద్దరు చెరువులో మునిగిపోయి చనిపోయారు. జాలర్లు మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 7, 2025

సాంకేతిక విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్ హనుమంతరావు

image

యువత సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందడం ద్వారా ఉజ్వల భవిష్యత్తుతో పాటు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం ఆలేరులోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. ఏటీసీ సెంటర్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల సంఖ్య, అందిస్తున్న కోర్సుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

News October 7, 2025

రేపు పెదఅమిరం రానున్న మాజీ సీఎం జగన్

image

మాజీ సీఎం వైఎస్ జగన్ బుధవారం జిల్లాకు రానున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అక్కడినుంచి పెదఅమిరం చేరుకుని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. ఈ సందర్భంగా జగన్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

News October 7, 2025

ఆదిలాబాద్: ఈ నెల 25లోపు KYC చేసుకోవాలి

image

ప్రస్తుతం పోస్టు శాఖా ద్వారా పింఛను పొందుతున్న చేయూత పింఛనుదారులు అందరూ బ్యాంక్‌లో నగదు జమ కావాలంటే బ్యాంకు ఖాతా యాక్టివేషన్ కోసం కేవైసీ చేయించుకొవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆధార్ కార్డు వివరాలు మున్సిపాలిటీలో ఈ నెల 25లోపు సమర్పించాలన్నారు. లేనిపక్షంలో తర్వాత పింఛను తీసుకోవడానికి గురయ్యే ఇబ్బందులకు తమరే భాధ్యత వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు.