News October 7, 2025

నిర్మల్‌: చెరువులో దూకి ఇద్దరు అన్నదమ్ముల మృతి

image

ఇద్దరు అన్నదమ్ములు చెరువులో పడి మృతి చెందిన ఘటన నిర్మల్ బంగల్పేట్ చెరువులో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన నరేష్ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన తమ్ముడు నవీన్ కాపాడడానికి వెళ్లాడు. దీంతో ఇద్దరు చెరువులో మునిగిపోయి చనిపోయారు. జాలర్లు మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 22, 2026

శ్రీశైలం మల్లన్న సన్నిధికి పెరుగుతున్న విదేశీ భక్తులు

image

శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి విదేశీ, ఎన్ఆర్ఐ భక్తుల సంఖ్య పెరుగుతోంది. శనివారం జరిగిన హుండీ కానుకల లెక్కింపులో అత్యధిక సంఖ్యలో విదేశీ కరెన్సీ రావడమే అందుకు నిదర్శనం. 624 USA డాలర్లు, 210 UAE దిర్హామ్స్, 10 సింగపూర్ డాలర్స్, 20 ఇంగ్లండ్ పౌండ్స్, 25 ఆస్ట్రేలియా డాలర్లు, 70 యూరోలు, వీటితో పాటు కువైట్ దినార్లు, కెనడా, న్యూజిలాండ్ డాలర్లు వచ్చాయని అధికారులు వివరించారు.

News March 22, 2026

అంబేడ్కర్ వర్సిటీకి పాలక మండలి లేదా?

image

ఎచ్చెర్లలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో పాలకమండలి లేదా? అన్న సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. 2022 నవంబర్ తర్వాత పాలకమండలి సమావేశం జరగలేదు. పాలకమండలిలో 12 మంది సభ్యులు ఉంటారు, ఏడుగురు అత్యవసర సభ్యులు. కాగా ఆరు నెలలకు ఓసారి కచ్చితంగా మండలి సమావేశం జరగాలి. అయితే అలా జరగడం లేదు. దీంతో పాలన గాడి తప్పిందనే అభిప్రాయాన్ని విద్యార్థులు, మేధావులు వ్యక్తం చేస్తున్నారు.

News March 22, 2026

సమ్మర్‌లో చికెన్ తింటున్నారా?

image

సమ్మర్‌లో మితంగా చికెన్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ‘ఇది అధిక ప్రొటీన్ కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియకు ఎక్కువ శక్తి అవసరమై శరీర వేడిని పెంచుతుంది. దీంతో తలనొప్పి, కళ్ల మంటలు, కండరాల నొప్పులు, విపరీతంగా చెమటలు పట్టడం, డీహైడ్రేషన్, అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చికెన్‌ను వారానికి ఒకసారి తింటే ఓకే కానీ రెండుమూడు సార్లు తీసుకుంటే బరువు పెరుగుతారు’ అని హెచ్చరిస్తున్నారు.