News October 7, 2025
తెలిసినవారే.. తెగిస్తున్నారు..

అత్యాచార ఘటనల్లో 98 శాతానికి పైగా నిందితులు బాధితురాళ్లకు పరిచయస్థులేనని జాతీయ నేర గణాంక సంస్థ తాజా నివేదిక వెల్లడిస్తోంది. వీరిలో ఆన్లైన్ వేదికల ద్వారా పరిచయమైనవారే ఎక్కువ మంది. చాలా ఘటనల్లో ఇరుగుపొరుగు వారు, సహోద్యోగులు, యజమానులు నిందితులు కాగా, కొన్ని కేసుల్లో మాత్రం కుటుంబసభ్యులే అకృత్యాలకు పాల్పడ్డట్లు రికార్డులు సూచిస్తున్నాయి. కాబట్టి అమ్మాయిలు తెలిసినవారైనాసరే అప్రమత్తంగా ఉండటం మంచిది.
Similar News
News October 7, 2025
గుడ్న్యూస్.. ఫ్రీగా ట్రైన్ టికెట్ తేదీల మార్పు

కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పారు. కన్ఫామైన ట్రైన్ టికెట్ డేట్స్ను ఇకపై ఫీజు లేకుండా మార్చుకునేందుకు కొత్త పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. JAN నుంచి ఇది అమల్లోకి వస్తుందని, టికెట్స్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉండదన్నారు. అయితే కొత్త తేదీల్లో టికెట్ కన్ఫర్మేషన్కు గ్యారంటీ ఇవ్వలేమన్నారు. అటు దీపావళికి దేశవ్యాప్తంగా 12,000 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు.
News October 7, 2025
కాంతార డ్రెసప్తో దైవాన్ని అపహాస్యం చేయొద్దు: రిషబ్ శెట్టి

‘కాంతార’ దైవ వస్త్రధారణతో అభిమానులు థియేటర్లలోకి రావడం, వీడియోలను SMలో పెట్టడం సరికాదని నటుడు రిషబ్ శెట్టి తెలిపారు. ఫ్యాన్స్ ఇలా చేయడం బాధిస్తోందని పేర్కొన్నారు. ఇది దైవాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించారు. ‘మేం చాలా పవిత్రంగా దైవ పాత్రలను సినిమాలో చూపించాం. ఎమోషన్స్ కోసం కొన్ని సన్నివేశాలు, దృశ్యాలను మూవీలో పెడుతుంటాం. SMలో వైరలవ్వడం కోసం కొందరు ఇలా చేయడం మానుకోవాలి’ అని కోరారు.
News October 7, 2025
గ్రూప్-1పై హైకోర్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం నిరాకరణ

TG: గ్రూప్-1పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హైకోర్టు <<17813238>>ఆదేశాలపై<<>> స్టే ఇచ్చేందుకు అత్యున్నత ధర్మాసనం నిరాకరించింది. గ్రూప్-1 ఫలితాలపై హైకోర్టు తీర్పును పలువురు సుప్రీంలో సవాల్ చేశారు. అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర తీర్పే ఇచ్చినందున జోక్యం చేసుకోలేమని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.