News October 7, 2025
అన్నమయ్య: అనాథలైన చిన్నారులు

కర్ణాటక సరిహద్దులోని రాయల్పాడు వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా రామసముద్రం(M) ఎర్రబోయినపల్లికి చెందిన రామంజులు, అతని భార్య కళావతి మృతిచెందిన విషయం తెలిసిందే. దసరా సెలవులు ముగించుకుని పని నిమిత్తం తిరిగి బెంగళూరుకు బైకుపై బయల్దేరిన దంపతులను టెంపో ఢీకొట్టడంతో ఇద్దరూ చనిపోయారు. వాళ్ల ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News October 7, 2025
కీటక జనిత వ్యాధుల నియంత్రణపై చర్యలు చేపట్టాలి : DMHO

పెద్దపల్లి జిల్లా DMHO డా. వాణిశ్రీ రాగినేడు మంగళవారం గర్రెపల్లిలో ఆశ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించారు. ప్రతి ఆశ 30 ఇళ్లు సందర్శించి దోమల లార్వా నిల్వలు తొలగించాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ఆదేశించారు. గర్భిణీ స్త్రీల నమోదు, జ్వరాల సర్వే, క్షయ నియంత్రణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని ఆమె సూచించారు.
News October 7, 2025
సంగారెడ్డి జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో భూ సేకరణ వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ కింద భూసేకరణ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
News October 7, 2025
MBNR: తెలుగు వర్శిటీ.. ఫలితాలు విడుదల

తెలుగు వర్శిటీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు వివిధ అంశాలలో వార్షిక పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు తెలుగు వర్శిటీ అధికారులు Way2Newsతో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను.. తెలుగు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 14 ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలు, కళాశాలల్లో జూన్ 2025లో పరీక్షలు నిర్వహించారు. ఫలితాలను www.teluguuniversity.ac.in వెబ్ సైట్లో సందర్శించాలన్నారు.