News October 7, 2025
సరైన రీతిలో వాదనలు వినిపించాలి: కలెక్టర్

ఏలూరు గౌతమీ సమావేశ మందిరంలో కలెక్టర్ వెట్రిసెల్వి అధ్యక్షతన మంగళవారం ఫారెస్ట్, కొల్లేరు పరీవాహక ప్రాంతాల అధికారులతో సమావేశం జరిగింది. ఫారెస్ట్ స్పెషల్ సెక్రటరీ కాంతీలాల్ దండే పాల్గొన్నారు. కొల్లేరు అంశంపై సుప్రీం కోర్టులో జరుగుతున్న వాదనలలో మన తరపున సరైన రీతిలో వాదనలు వినిపించాలని కలెక్టర్ కోరారు. అలాగే కాంటూరు కుదింపు కారణంగా ఉపాధి కోల్పోయిన జి.రాయితీ రైతులను ఆదుకోవాలని అధికారులకు సూచించారు.
Similar News
News March 14, 2026
బుగ్గారం: ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామ ఎస్సీకాలనీ వద్ద గల జాతీయ రహదారిపై జగిత్యాల నుండి ధర్మపురి వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికీ ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ఇంటి పరిసర ప్రాంతాలలో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
News March 13, 2026
యుద్ధం.. ఐదుగురు భారతీయులు మృతి

ఒమన్లోని సోహార్ పారిశ్రామిక ప్రాంతంలో కూల్చివేసిన డ్రోన్ శకలాలు పడటంతో ఇద్దరు భారతీయులు మృతిచెందినట్లు విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఈ ఘటనలో మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. మరోవైపు హార్ముజ్లో చిక్కుకుపోయిన నౌకల్లో ఉన్న భారత నావికుల్లో ముగ్గురు చనిపోయినట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఐదుగురు ఇండియన్స్ ప్రాణాలు విడిచినట్లు అయ్యింది.
News March 13, 2026
టీచర్ ప్రతిరోజు భోజనం నాణ్యత చెక్ చేయాలి: మంత్రి లోకేశ్

AP: మైలవరంలో విద్యార్థులకు నాసిరకం భోజనం <<19370398>>పెట్టడంపై<<>> విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతిరోజూ ఒక టీచర్ భోజనం నాణ్యత పరిశీలించాలని ఆదేశించారు. MLAలు వారానికి ఒక స్కూలును సందర్శించాలని విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. డొక్కా సీతమ్మ పేరుపై నడుస్తున్న భోజన పథకంపై కుట్రలు చేసినా, నాణ్యత తగ్గినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


