News October 7, 2025

బిహార్‌ ఎలక్షన్స్.. బీజేపీ, జేడీయూకి సమాన సీట్లు!

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల కసరత్తు జరుగుతోంది. మొత్తం 243 సీట్లలో 205 చోట్ల ఇరు పార్టీలు సమాన స్థానాల్లో బరిలో దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 38 సీట్లు NDAలోని LJP, HAM, RLMలకు ఖరారయ్యే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసి అధికారం చేపట్టాయి. ఇక బిహార్ ఎన్నికలు NOV 6, 11న జరగనుండగా 14న ఫలితాలు వెలువడతాయి.

Similar News

News October 7, 2025

నిద్రపోయే ముందు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం

image

నిద్రపోయే ముందు మహిళలు ఇంట్లోని గదులన్నింటిలో కర్పూరం వెలిగిస్తే ఆ గృహంలోకి ఐశ్వర్య దేవత అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు. ‘కర్పూరం నవగ్రహాలలో శుక్రుడికి సంబంధించినది. నిద్రపోయే ముందు దీన్ని వెలిగిస్తే.. ఇంటి వాతావరణంలో సానుకూల శక్తి పెరిగి, శుక్రుని బలం వృద్ధి చెందుతుంది. ఫలితంగా.. ఆ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ పవిత్రమైన సాధనతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు’ అని అంటున్నారు.

News October 7, 2025

స్పోర్ట్స్ న్యూస్ అప్డేట్స్

image

* ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్‌కు నామినేట్ అయిన అభిషేక్ శర్మ, కుల్దీప్, బ్రయాన్(ZIM)
* DGCA డ్రోన్ పైలట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసినట్లు ప్రకటించిన భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ
* సియట్ అవార్డ్స్‌లో సంజూ శాంసన్ టీ20 బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, శ్రేయస్ అయ్యర్ స్పెషల్ అవార్డ్ అందుకున్నారు.
* ఆస్ట్రేలియాపై ఆడడం తనకు ఇష్టమని, అక్కడి ప్రజలు క్రికెట్‌ను ఎంతో ప్రేమిస్తారన్న రోహిత్ శర్మ

News October 7, 2025

జగన్ వస్తే.. నేనూ వస్తా: సత్యకుమార్

image

AP: నర్సీపట్నం మెడికల్ కాలేజీ పరిశీలనకు జగన్ వస్తే తానూ వచ్చి పరిస్థితిని వివరిస్తానని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలను గత ప్రభుత్వం విస్మరించిందని, ఆ పాపం ఇప్పుడు తమకు శాపంగా మారిందని దుయ్యబట్టారు. ప్రజలు గుణపాఠం చెప్పినా జగన్‌లో మార్పు రావడం లేదని సత్యకుమార్ మండిపడ్డారు. వైసీపీ నేతలకు పీపీపీకి, ప్రైవేటైజేషన్‌కు మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు.