News October 7, 2025

జామాకులనూ ఆన్‌లైన్‌‌లో అమ్మేస్తున్నారు!

image

ఎండిన, పచ్చి జామాకులకు ఆన్‌లైన్‌లో డిమాండ్ బాగా పెరిగింది. వీటితో చాలా హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయని తెలియడంతో చాలా మంది కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో 50 జామ ఆకులను ఏకంగా రూ.300కు, మరో సైట్‌ ఎండిపోయిన 20 ఆకులను రూ.300కు దర్జాగా అమ్మేస్తోంది. అయితే గతేడాది జామాకుల బిజినెస్ రూ.1300 కోట్లు జరిగిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Similar News

News March 13, 2026

42 ఏళ్లు కోమాలో ఉన్న అరుణ గురించి తెలుసా?

image

12 ఏళ్లుగా కోమాలో ఉన్న హరీశ్ రాణా(32) కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఇటీవల <<19352489>>అనుమతిచ్చింది.<<>> ఈ తీర్పునకు ముంబైకి చెందిన నర్సు అరుణా షాన్‌బాగ్ కేసు స్ఫూర్తి. 1973లో ఆమెను రేప్ చేసి దాడి చేయడంతో 42 ఏళ్లపాటు కోమాలో ఉండి 2015లో చనిపోయారు. 2009లో ఆమె కారుణ్య మరణం కోసం ఓ జర్నలిస్టు పిల్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే 2011, 2018, 2023లో వెలువడిన తీర్పులు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేశాయి.

News March 13, 2026

కారుణ్య మరణంపై 2011, 2018 తీర్పులు ఏం చెప్పాయి?

image

సరైన రక్షణ చర్యలు, స్థానిక హైకోర్టు ఆమోదంతో <<19352489>>కారుణ్య మరణానికి<<>> చట్టబద్ధత ఉంటుందని 2011లో సుప్రీం వెల్లడించింది. కోలుకోవడం సాధ్యం కానప్పుడు లైఫ్ సపోర్టును తొలగించవచ్చని, దీనిపై పార్లమెంటులో చట్టం చేయాలని సూచించింది. ఆర్టికల్ 21 గౌరవప్రదంగా జీవించే హక్కుతోపాటు గౌరవప్రదంగా మరణించే హక్కునూ కల్పిస్తుందని 2018లో పేర్కొంది. 2023లో పలు సవరణలతో కారుణ్య మరణంపై తుది తీర్పు వెలువడింది.

News March 13, 2026

నేడే పీఎం కిసాన్ నిధులు విడుదల

image

పీఎం కిసాన్ 22వ విడత నిధులను కేంద్రం ఇవాళ విడుదల చేయనుంది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులను రిలీజ్ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా అర్హులైన 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో.. రూ.18,640 కోట్లను జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 2019 నుంచి కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలను వ్యవసాయ పెట్టుబడి సాయం కింద అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.