News October 7, 2025
సంగారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలి: ఎస్పీ

పోలీసు అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్తు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసిన చర్య తీసుకోవాలని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
Similar News
News October 7, 2025
హిమాచల్ప్రదేశ్ ప్రమాదం.. 18 మంది మృతి

హిమాచల్ప్రదేశ్లో టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడిన <<17942357>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 18కి చేరింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఇప్పటివరకు ముగ్గురిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున PM పరిహారం ప్రకటించారు.
News October 7, 2025
ఈ విషయంలో Gen Zలు చాలా బెటర్!

యంగర్ జనరేషన్స్లో ఆల్కహాల్ అలవాటు తక్కువేనని ఓ స్టడీ తెలిపింది. ముఖ్యంగా Gen Z(1997-2012)లు బేబీ బూమర్లు(1946-64), మిలీనియల్స్(1981-96)తో పోల్చితే మద్యం తక్కువగా సేవిస్తున్నారని ఆస్ట్రేలియా ఫ్లిండర్స్ యూనివర్సిటీ రీసెర్చర్స్ వెల్లడించారు. 2 దశాబ్దాల్లోని 23 వేల మంది డేటాను విశ్లేషించారు. బేబీ బూమర్స్ కన్నా మిలీనియల్స్ సగటున తక్కువే తాగినా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నట్లు గుర్తించారు.
News October 7, 2025
నల్గొండ: మైనర్ హత్యాచారం.. పోక్సో కేసు నమోదు

నల్గొండ మండలంలో బాలిక హత్యాచార ఘటనపై పోక్సో కేసు నమోదైంది. ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి గదికి తీసుకెళ్లి హత్యాచారం చేశాడని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు తక్షణమే నిందితుడు కృష్ణతో పాటు అతని స్నేహితుడిపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.