News October 7, 2025
రేపు ఇద్దరు మంత్రులతోనూ మాట్లాడతా: TPCC చీఫ్

TG: మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదంపై TPCC చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ స్పందించారు. ‘ఇది ఇంటి సమస్య. రేపు ఉదయం ఇద్దరు మంత్రులను పిలిచి మాట్లాడతా. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని సరిదిద్దుతాం. మంత్రి శ్రీధర్బాబు కూడా వారితో మాట్లాడారు. త్వరలోనే సమస్య పరిష్కరిస్తాం’ అని మీడియాకు తెలిపారు. అంతకుముందు ఈ వివాదంపై ఎస్సీ ఎమ్మెల్యేలు మహేశ్కుమార్తో భేటీ అయ్యారు.
Similar News
News October 7, 2025
హిమాచల్ప్రదేశ్ ప్రమాదం.. 18 మంది మృతి

హిమాచల్ప్రదేశ్లో టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడిన <<17942357>>ఘటనలో<<>> మృతుల సంఖ్య 18కి చేరింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఇప్పటివరకు ముగ్గురిని రెస్క్యూ బృందాలు రక్షించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున PM పరిహారం ప్రకటించారు.
News October 7, 2025
ఈ విషయంలో Gen Zలు చాలా బెటర్!

యంగర్ జనరేషన్స్లో ఆల్కహాల్ అలవాటు తక్కువేనని ఓ స్టడీ తెలిపింది. ముఖ్యంగా Gen Z(1997-2012)లు బేబీ బూమర్లు(1946-64), మిలీనియల్స్(1981-96)తో పోల్చితే మద్యం తక్కువగా సేవిస్తున్నారని ఆస్ట్రేలియా ఫ్లిండర్స్ యూనివర్సిటీ రీసెర్చర్స్ వెల్లడించారు. 2 దశాబ్దాల్లోని 23 వేల మంది డేటాను విశ్లేషించారు. బేబీ బూమర్స్ కన్నా మిలీనియల్స్ సగటున తక్కువే తాగినా ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నట్లు గుర్తించారు.
News October 7, 2025
నిద్రపోయే ముందు ఇలా చేస్తే.. లక్ష్మీ కటాక్షం

నిద్రపోయే ముందు మహిళలు ఇంట్లోని గదులన్నింటిలో కర్పూరం వెలిగిస్తే ఆ గృహంలోకి ఐశ్వర్య దేవత అడుగు పెడుతుందని పండితులు చెబుతున్నారు. ‘కర్పూరం నవగ్రహాలలో శుక్రుడికి సంబంధించినది. నిద్రపోయే ముందు దీన్ని వెలిగిస్తే.. ఇంటి వాతావరణంలో సానుకూల శక్తి పెరిగి, శుక్రుని బలం వృద్ధి చెందుతుంది. ఫలితంగా.. ఆ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. ఈ పవిత్రమైన సాధనతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు’ అని అంటున్నారు.