News October 7, 2025
వెండి ధర ఏడాదిలో 400% పెరగొచ్చు: రాబర్ట్

‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రైటర్ రాబర్ట్ కియోసాకి వెండి ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం వెండి చౌకగానే ఉంది. గత 12నెలల్లో వెండి ధర 45% మాత్రమే పెరిగింది. మున్ముందు 400% పెరగొచ్చు. వెండిపై పెట్టే $100 ఏడాదిలో $500 అవ్వొచ్చు’ అని అంచనా వేశారు. దీంతో వెండి ధర KGకి రూ.5లక్షలు దాటనుందనే చర్చ మొదలైంది. కాగా అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితులతో ఇన్వెస్టర్స్ బంగారం, వెండి వైపు మొగ్గుచూపుతున్నారు.
Similar News
News March 21, 2026
కుప్పకూలిన ధరలు.. టమాటా రైతుల కన్నీళ్లు

AP: గిట్టుబాటు ధర లభించక టమాటా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్లో నిన్న KG ధర గరిష్ఠంగా ₹7, కనిష్ఠంగా ₹3, సగటున ₹5 మాత్రమే పలికింది. అన్నమయ్య జిల్లాలో కోత ఖర్చులూ రాకపోవడంతో అన్నదాతలు పంటను పశువులకు వదిలేశారు. శ్రీకాకుళం(D)లోని పలు గ్రామాల్లో 27 KGల ట్రే ధర ₹70-90కి పడిపోయింది. వ్యాపారులు మాత్రం KG ₹20-30కి విక్రయిస్తుండటం గమనార్హం. మీ ఏరియాలో టమాటా రేటు ఎలా ఉంది?
News March 21, 2026
పాక్ క్రికెట్లో టాక్సిక్ వర్క్ కల్చర్: గ్యారీ కిర్స్టెన్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ కోచ్ గ్యారీ కిర్స్టెన్ తీవ్ర విమర్శలు చేశారు. బోర్డులో ఇతరుల జోక్యం, టాక్సిక్ వర్క్ కల్చర్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిని తానెక్కడా చూడలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్స్కు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారన్నారు. వృత్తిపరమైన గౌరవం లేకపోవడంతో రిజైన్ చేసినట్లు తెలిపారు. కాగా ఆయన APR 15న శ్రీలంక కోచ్గా బాధ్యతలు <<19339760>>చేపట్టనున్నారు.<<>>
News March 21, 2026
రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఇది అమలులోకి రానుంది. ఇటీవల కేంద్రం అనౌన్స్ చేసిన 10% గ్యాస్కు ఇది అదనం. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.


