News October 7, 2025
ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ రెడీ: ADB SP

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటుతో పాటు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాల వరకు తరలింపు పకడ్బందీగా చేపడుతామన్నారు. ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
Similar News
News October 7, 2025
ఆదిలాబాద్: ఈ నెల 25లోపు KYC చేసుకోవాలి

ప్రస్తుతం పోస్టు శాఖా ద్వారా పింఛను పొందుతున్న చేయూత పింఛనుదారులు అందరూ బ్యాంక్లో నగదు జమ కావాలంటే బ్యాంకు ఖాతా యాక్టివేషన్ కోసం కేవైసీ చేయించుకొవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆధార్ కార్డు వివరాలు మున్సిపాలిటీలో ఈ నెల 25లోపు సమర్పించాలన్నారు. లేనిపక్షంలో తర్వాత పింఛను తీసుకోవడానికి గురయ్యే ఇబ్బందులకు తమరే భాధ్యత వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు.
News October 7, 2025
ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: ADB కలెక్టర్

ఎన్నికలను పకడ్బందీగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా కూడా ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ముందస్తు ప్రణాళికతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు 120 గుర్తించినట్లు తెలిపారు. రిషేప్షన్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు 20 ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి తుది జాబితా ప్రకటన వరకు నిబంధనలు పాటించాలని సూచించారు.
News October 7, 2025
ADB: బ్యాంక్లో నగదు జమయ్యేలా చర్యలు

పింఛన్ దారులకు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ADB కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు జారీ చేశారు. దస్నాపూర్, రాంనగర్, దోబీ, షాద్, దుర్గా, కైలాష్, సుభాష్, హనుమాన్ నగర్, టైలర్స్, టీచర్స్ కాలనీ, న్యూ హౌసింగ్ బోర్డు, KRK పిట్టలవాడ నుంచి లబ్ధిదారులు మావలకు వెళ్లాల్సి వచ్చేది. వారి సమస్యను పరిష్కరించేందుకు వారి బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అయ్యేవిధంగా గ్రామీణాభివృద్ధి సంస్థకు ఆదేశాలు ఇచ్చారు.