News October 7, 2025
స.హ చట్టంపై అవగాహన ఉండాలి: మహేందర్ జీ

సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ మహేందర్ జీ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఈనెల 5వ తేదీ నుంచి సమాచార హక్కు చట్ట వారోత్సవాల్లో మొదలయ్యాయన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు అధికారులు సమాచార హక్కు వారోత్సవాలను జిల్లాలోని డివిజన్, మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు.
Similar News
News March 18, 2026
సిరిసిల్ల: వరి ధాన్యం కొనుగోలు సజావుగా చేయాలి: కలెక్టర్

వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. యాసంగి సీజన్(2025-26) ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్లు, తాగు నీరు, కల్పించాలని కలెక్టర్ అన్నారు.
News March 18, 2026
మొజ్తబాను వెతికి పట్టుకుని చంపేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని వెతికి పట్టుకుని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించింది. ‘ఇజ్రాయెల్కు ముప్పు కలిగించే ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని కొనసాగిస్తాం. మా దేశానికి వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారు మా నుంచి <<19410383>>తప్పించుకోలేరు<<>>. వారిని వెంబడిస్తాం. కనుగొంటాం. హతమారుస్తాం’ అని IDF ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ స్పష్టంచేశారు. అయితే మొజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం లేదని చెప్పారు.
News March 18, 2026
తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో నేడు కిసాన్ మేళా

కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం ‘కిసాన్ మేళా-2026’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి స్వప్న జాదవ్ తెలిపారు. సుమారు వెయ్యి మంది రైతులతో నిర్వహించే ఈ మేళాలో ఆధునిక యంత్రాల ప్రదర్శన, శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష చర్చలు, సరికొత్త సాగు సాంకేతికతపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించనున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


