News October 7, 2025

నిర్మల్: ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించాలి

image

ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందివ్వాలని టీజీ ఎన్.పి.డి.సి.ఎల్ సిఎండి కర్నాటి వరుణ్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్మల్‌లోని కలెక్టరేట్‌లో ఆయన విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో విద్యుత్ వినియోగంపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 8, 2025

రేపే తీర్పు.. సర్వత్రా ఉత్కంఠ

image

TGలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠకు రేపు తెర పడనుంది. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగనుంది. పిటిషనర్ వాదనను సమర్థిస్తూ న్యాయస్థానం తీర్పిస్తే రిజర్వేషన్ల అమలు నిలిచిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే పార్టీ తరఫున ఈ హామీని నెరవేరుస్తూ ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నారు. మరి కోర్టు తీర్పు ఎలా వస్తుందో చూడాలి.

News October 8, 2025

మోహన్‌బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా

image

AP: సినీ నటుడు మోహన్‌బాబుకు ఉన్నత విద్యా కమిషన్ షాకిచ్చింది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో మూడేళ్లుగా విద్యార్థుల నుంచి అదనంగా రూ.26 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడించింది. 15 రోజుల్లోగా ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. విచారణ అనంతరం రూ.15 లక్షల జరిమానా విధించింది. యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేసింది.

News October 8, 2025

విషం తాగి ఆత్మహత్యాయత్నం.. ప్రాణాలు కాపాడిన పోలీస్

image

తంగళ్ళపల్లిలో మహేష్ అనే యువకుడు విషం తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా పోలీసు సమయస్ఫూర్తితో ప్రాణాలు దక్కాయి. విషం తాగానని తల్లికి ఫోన్ చేసి చెప్పడంతో తల్లి వెంటనే డయల్ 100కు సమాచారం ఇచ్చారు. వెంటనే బ్లూ కోట్స్ కానిస్టేబుల్ ప్రశాంత్ మహేష్ ఫోన్ నంబర్‌ను ట్రేస్ చేశారు. అతడిని ఆసుపత్రికి తరలించగా ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించారు. కానిస్టేబుల్ ప్రశాంత్‌ను పలువురు అభినందించారు.