News October 7, 2025
విజయవాడలో చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి

చెట్టుపై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన విజయవాడలో మంగళవారం జరిగింది. గాయత్రీ నగర్లోని నలంద స్కూల్లో చెట్లు నరికేందుకు పమిడిముక్కల నుంచి రమణ అనే వ్యక్తిని పని నిమిత్తం తీసుకొచ్చారు. చెట్టు నరుకుతూ ఉండగా రమణ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 8, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News October 8, 2025
స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులుంటే సవరణ చేసుకోవచ్చు: జేసీ

కొత్తగా వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల్లో తప్పులుంటే సవరణ చేసుకోవచ్చని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సమీప గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు వెళ్లి ఎలాంటి రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల చివరి వరకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. స్వయంగా బయోమెట్రిక్ ద్వారా దరఖాస్తుదారులు ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News October 8, 2025
దసరా మహోత్సవం విజయవంతం: కలెక్టర్ లక్ష్మీశా

2025 సంవత్సరానికి సంబంధించి దసరా మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ లక్ష్మీశా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ దాన్య చంద్ర అన్నారు. దసరా మహోత్సవంలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన అధికారులకు ప్రశంస పత్రాలు అందించి, అభినందనలు తెలిపారు.