News October 7, 2025

ఆదిలాబాద్: ఈ నెల 25లోపు KYC చేసుకోవాలి

image

ప్రస్తుతం పోస్టు శాఖా ద్వారా పింఛను పొందుతున్న చేయూత పింఛనుదారులు అందరూ బ్యాంక్‌లో నగదు జమ కావాలంటే బ్యాంకు ఖాతా యాక్టివేషన్ కోసం కేవైసీ చేయించుకొవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆధార్ కార్డు వివరాలు మున్సిపాలిటీలో ఈ నెల 25లోపు సమర్పించాలన్నారు. లేనిపక్షంలో తర్వాత పింఛను తీసుకోవడానికి గురయ్యే ఇబ్బందులకు తమరే భాధ్యత వహించవలసి ఉంటుందని స్పష్టం చేశారు.

Similar News

News October 8, 2025

ADB: మూఢ నమ్మకాలకు ఆజ్యం పోస్తున్న ఆకతాయిలు

image

సాంకేతికత రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నా ప్రజలను మూఢనమ్మకాలు గాఢాంధకారంలోకి నెట్టేస్తున్నాయి. పౌర్ణమి అమావాస్య రోజుల్లో కొందరు ఆకతాయిలు రోడ్లపై నిమ్మకాయలు పసుపు కుంకుమ వంటివి వేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఆశ్వయుజ పౌర్ణమి సందర్భంగా జిల్లాలో పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారులు ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తే ఇలాంటి భయం లేకుండా ఉంటుందని భౌతిక వాదులు పేర్కొన్నారు.

News October 8, 2025

ADB: నేడే కీలక తీర్పు.. జిల్లాలో ఉత్కంఠ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన కీలకమైన కోర్టు తీర్పు నేడు వెలువడనుంది. దీంతో ఆదిలాబాద్ జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు జిల్లాలోని 20 జడ్పీటీసీ, 166 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయనుంది. కోర్టు తీర్పు కోసం జిల్లాలోని రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News October 8, 2025

ADB: రెండు టీములు ఏర్పాటు చేసి పూర్తిచేయాలి

image

సాదాబైనామా, పీఓటీలకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన ప్రక్రియ జరపాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. వెంట వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్ర స్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు భూ భారతి కింద వచ్చిన దరఖాస్తుల పురోగతిపై నోటీసులు జనరెట్ చేసి సర్వే చేసిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియను రెండు టీములు ఏర్పాటు చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు.