News October 7, 2025

మార్టూరులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

మార్టూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న జనార్దన్ కాలనీలో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన రాంబాబు (38) ప్రమాదవశాత్తు ఇంటిదగ్గర కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అతన్ని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Similar News

News March 7, 2026

HYD ఆక్రమణలు, చెత్తతో నిండింది: సీఎం

image

HYD ఆక్రమణలు, చెత్తతో నిండిపోయిందని గొప్ప సుందరమైన నగరంగా HYDను మంచిగా చేస్తానంటే BRS ఒప్పుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మేము చేయలేదు నువ్వు చేయొద్దని KTR అంటున్నారని వ్యఖ్యానించారు. నగరాన్ని మంచిగా చేసుకోవడానికి ప్రజా ప్రతినిధులను విదేశాలకు పంపామన్నారు. విమానాశ్రయం కట్టే సమయంలో కొంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు అది పెద్ద ఆస్తిగా మారింది. ఎవ్వరూ మూసీలో బతకాలి అనుకోరన్నారు.

News March 7, 2026

CEC వేలు కోసేసే వాడిని.. TMC ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

image

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మమతా బెనర్జీతో CEC చెడుగా ప్రవర్తించారు. CM వైపు వేలు ఎత్తడానికి ధైర్యం చేశారు. CEC కాకపోయుంటే నేను అదే రోజు ఆయన వేలును కోసేసే వాడిని’ అని కోల్‌కతాలో నిరసన కార్యక్రమంలో అన్నారు. SIR విషయంలో గత నెలలో జ్ఞానేశ్ కుమార్‌, మమత మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

News March 7, 2026

కామారెడ్డి: జర జాగ్రత్త..!

image

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో భిక్కనూరు, మేనూరు, సోమూరు 38.2°C, కొల్లూరు, సదాశివనగర్ 38.1, ఎల్పుగొండ, బీర్కూర్ 38, సర్వాపూర్ 37.8, డోంగ్లి, బీబీపేట 37.7, పుల్కల్, పిట్లం 37.3, మాచాపూర్, గాంధారి, నాగిరెడ్డిపేట 37.2, దోమకొండ 37.1, కామారెడ్డి 37, బిచ్కుంద 36.7, లింగంపేట, లచ్చపేట 36.6, జుక్కల్ 36.5°C ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.