News October 7, 2025

సంగారెడ్డి జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో భూ సేకరణ వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ కింద భూసేకరణ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News October 8, 2025

ADB: RTO చలాన్ APK ఫైల్ ఓపెన్ చేయకండి

image

RTO చలాన్ పేరుతో ఓ APK ఫైల్ సోషల్ మీడియా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో పలువురికి గుర్తుతెలియని నంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చింది. చలాన్ పెండింగ్ ఉందని, కోర్టులో కట్టాలని FORM నింపాలంటూ డీటెయిల్స్‌తో కూడిన APK ఫైల్ వచ్చింది. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగమని, ఎవరూ కూడా ఈ APKను ఓపెన్ చేయవద్దని పోలీసులు సూచించారు. ఆ మెసేజ్‌ను వెంటనే డిలీట్ చేయాలన్నారు.

News October 8, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 08, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.55 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.08 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.21 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.59 గంటలకు
✒ ఇష: రాత్రి 7.12 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News October 8, 2025

ఇంద్రకీలాద్రి ఆలయానికి రూ.10.30కోట్ల ఆదాయం

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయానికి దసరా నవరాత్రుల సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయాన్ని అధికారులు లెక్కించారు. 11 రోజుల్లో రూ.10.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది రూ.9.32 కోట్లు రాగా, ఈసారి రూ.కోటి పెరిగింది. అంతే కాకుండా 387 గ్రాముల బంగారం, 19 కేజీల 450 గ్రాముల వెండిని భక్తులు అమ్మవారికి హుండీ కానుకగా సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు.