News October 7, 2025
ఎమ్మెల్యే రాజాసింగ్పై భువనగిరి పీఎస్లో ఫిర్యాదు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విద్వేషపూరిత ప్రసంగం, మతపరమైన మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ భువనగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. భువనగిరి ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఈ ఫిర్యాదును అందజేశారు. జేఏసీ నాయకులు మహమ్మద్ అతహర్, షరీఫ్, ఇబ్రహీం మాట్లాడుతూ.. రాజాసింగ్ బహిరంగ సభలో రెచ్చగొట్టే, కించపరిచే వ్యాఖ్యల చేశారని, తక్షణమే కేసు నమోదు చేయాలని కోరారు.
Similar News
News March 25, 2026
చమురు వణుకుపుట్టిస్తోంది!

ప్రపంచంలో ఆయిల్ కొరత అతిపెద్ద సమస్యగా మారింది. గల్ఫ్తో పాటు ఇతర వనరులూ దాడులకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభానికి ప్రత్యామ్నాయం అనుకున్న రష్యన్ రిఫైనరీలూ ఇప్పుడు టార్గెట్గా మారాయి. ఇటీవల రష్యా రిఫైనరీలోని కోటి లీటర్ల స్టోరేజ్ ట్యాంక్పై ఉక్రెయిన్ దాడి చేసింది. మరోవైపు USలోని టెక్సాస్ రిఫైనరీలో పేలుడు సంభవించింది. ఫలితంగా గ్లోబల్ సప్లై చెయిన్కు అంతరాయం ఏర్పడుతోంది.
News March 25, 2026
చమురు వణుకుపుట్టిస్తోంది!

ప్రపంచంలో ఆయిల్ కొరత అతిపెద్ద సమస్యగా మారింది. గల్ఫ్తో పాటు ఇతర వనరులూ దాడులకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభానికి ప్రత్యామ్నాయం అనుకున్న రష్యన్ రిఫైనరీలూ ఇప్పుడు టార్గెట్గా మారాయి. ఇటీవల రష్యా రిఫైనరీలోని కోటి లీటర్ల స్టోరేజ్ ట్యాంక్పై ఉక్రెయిన్ దాడి చేసింది. మరోవైపు USలోని టెక్సాస్ రిఫైనరీలో పేలుడు సంభవించింది. ఫలితంగా గ్లోబల్ సప్లై చెయిన్కు అంతరాయం ఏర్పడుతోంది.
News March 25, 2026
మునగాల సాగర్ ఎడమ కాలవలో మృతదేహం

మునగాల మండల పరిధిలోని సాగర్ ఎడమ కాలవలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం కాలవ వద్దకు వెళ్లిన రైతులు నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని గమనించి వెంటనే గ్రామస్థులకు, సమాచారం అందించారు. అనంతరం పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


