News April 7, 2024

హీరోయిన్‌కు హత్యా బెదిరింపులు

image

తెలుగులో తేజ దర్శకత్వంలో ‘ధైర్యం’ సినిమాలో హీరోయిన్‌గా చేసిన రైమా సేన్.. ప్రస్తుతం ‘మా కాళి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. 1946 ఆగస్టు 16న కోల్‌కతాలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నావని కొందరు వ్యక్తులు తనకు కాల్స్ చేసి బెదిరిస్తున్నారని రైమా సేన్ వాపోయారు. హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.

Similar News

News October 9, 2024

హనుమంత వాహనంపై మలయప్పస్వామి

image

AP: తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం హనుమంత వాహనంపై రామావతారంలో మలయప్పస్వామి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 7గంటలకు గజ వాహనంపై మలయప్పస్వామి ఊరేగుతారు.

News October 9, 2024

ఇరాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ మిసైల్స్ అటాక్

image

సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిర్‌స్ట్రైక్స్ చేపట్టింది. వెపన్స్ స్మగ్లింగ్‌లో జోక్యం ఉన్న హై ర్యాంకింగ్ హెజ్బొల్లా టెర్రరిస్టే లక్ష్యంగా దాడి చేసినట్టు తెలిసింది. సిరియా న్యూస్ ఏజెన్సీ SANA దీనిని కన్ఫమ్ చేసింది. ఫారిన్ ఎంబసీ దగ్గర్లోని కమర్షియల్ బిల్డింగ్‌పై ఇజ్రాయెల్ 3 మిసైళ్లు ప్రయోగించినట్టు తెలిపింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారని వెల్లడించింది.

News October 9, 2024

హరియాణాలో కాంగ్రెస్‌కు పెరిగిన ఆదరణ

image

హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక్కడ BJP-కాంగ్రెస్ మధ్య 11 సీట్ల తేడా ఉన్నప్పటికీ ఓటు షేర్‌లో రెండింటికీ 39% వచ్చింది. 2019లో కాంగ్రెస్‌కు 28.08% ఓట్లు రాగా, ప్రస్తుతం గణనీయంగా ఆదరణ పెరిగింది. BJP గత ఎన్నికల్లో 36.49% ఓటు బ్యాంక్‌తో 40సీట్లు గెలుచుకుంది. జననాయక్ జనతా పార్టీకి 2019లో 14.80% ఓట్లతో 10సీట్లలో విజయఢంకా మోగించింది.