News October 8, 2025

దసరా మహోత్సవం విజయవంతం: కలెక్టర్ లక్ష్మీశా

image

2025 సంవత్సరానికి సంబంధించి దసరా మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ లక్ష్మీశా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, మున్సిపల్ కమిషనర్ దాన్య చంద్ర అన్నారు. దసరా మహోత్సవంలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులతో మంగళవారం సాయంత్రం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం నిర్వహించారు. దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి సహకరించిన అధికారులకు ప్రశంస పత్రాలు అందించి, అభినందనలు తెలిపారు.

Similar News

News October 8, 2025

MHBD: హెడ్మాస్టర్‌కు పాముకాటు

image

పాఠశాలలో ఉపాధ్యాయురాలికి పాము కాటు వేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొడిసెల మిట్ట ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ పి. సరితకు మంగళవారం మధ్యాహ్నం పాఠశాలలో పాము కాటు వేసింది. గమనించిన స్థానికులు చికిత్స కోసం వెంటనే గంగారం ప్రాథమిక వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని గ్రామస్థులు తెలిపారు.

News October 8, 2025

ప్రతి శనివారం టిడ్కో ఇళ్ల కేటాయింపు: మంత్రి

image

AP: 2026 జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో అమృత్ 2.0 స్కీమ్‌లో భాగంగా పట్టణాల్లో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. గడువులోగా సంబంధిత తాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచించారు.

News October 8, 2025

భక్తి ఉంటే చాలు.. శివుడే అడ్డంకుల్ని తొలగిస్తాడు!

image

భక్తి యోగం అన్ని మార్గాలకంటే అత్యంత శ్రేష్ఠమైనది. దీనికి సంపద, జ్ఞానమనే కఠిన నియమాలు అవసరం లేదు. నిష్కల్మషమైన భక్తి ఉంటే చాలు. అలాంటి భక్తులకు, భక్తవత్సలుడైన పరమేశ్వరుడే స్వయంగా అన్ని అడ్డుగోడలను, విఘ్నాలను తొలగిస్తాడు. ఏ కష్టమూ లేకుండా తత్వజ్ఞానం లభించేలా అనుగ్రహిస్తాడు. శివుని దయతోనే ముక్తి, బ్రహ్మజ్ఞానం సాధ్యమవుతాయి. మనల్ని రక్షించేది, భక్తి మార్గంలో నడిపించేది ఆ పరమ శివుడే! <<-se>>#Daivam<<>>