News October 8, 2025

MBNR: దసరా EFFECT.. రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం

image

దసరా పండుగ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పది డిపోలలో రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం వచ్చినట్లు మహబూబ్ నగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పి.సంతోష్ కుమార్ Way2Newsతో తెలిపారు. గత నెల 20 నుండి ఈ నెల 6 వరకు 14 రోజుల్లో బస్సులను 53.07 లక్షల కిలోమీటర్లు తిప్పి.. రూ.33 కోట్ల 65 లక్షల ఆదాయం వచ్చిందని, ఈ మేరకు కండక్టర్‌లు, డ్రైవర్లు, ప్రతి ఆర్టీసీ ఉద్యోగికి ప్రత్యేక అభినందనలని ఆర్ఎం తెలిపారు. SHARE IT

Similar News

News October 8, 2025

ఉమ్మడి వరంగల్‌లో విష జ్వరాలతో మృత్యువాత..!

image

విషజ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. ములుగు(D) వాజేడులో నర్సింగ్ విద్యార్థిని అంజలి, నెక్కొండ(M) గుండ్రపల్లిలో చిన్నారి సహస్ర, లింగాలఘణపురం(M) మాణిక్యాపురంలో మహేష్ మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. లక్షల్లో ఖర్చు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

News October 8, 2025

ట్రంప్ ఆంక్షలు.. USకు నో చెబుతున్న IND స్టూడెంట్స్!

image

ట్రంప్ తీసుకొస్తున్న కొత్త ఆంక్షలతో US వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు UK, కెనడా, AUS, జర్మనీ వంటి దేశాల వైపు చూస్తున్నారు. దీంతో USకు వెళ్లే IND స్టూడెంట్స్ సంఖ్య భారీగా తగ్గుతోంది. ట్రేడ్.జీవోవి డేటా ప్రకారం 2024 AUGతో పోలిస్తే ఈ ఏడాది US వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 44% తగ్గింది. వీసాల జారీలో స్ట్రిక్ట్ రూల్స్, లివింగ్ కాస్ట్ పెరుగుదల వంటి అంశాలే దీనికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

News October 8, 2025

నల్ల చెరకుకు కేరాఫ్ బల్లికురవ

image

నల్లచెరుకు సాగుకు కేరాఫ్‌గా బల్లికురవ మండలం నిలుస్తోందని రైతులు అంటున్నారు. మొదట్లో 5 ఎకరాలతో మొదలైన సాగు కూకట్లపల్లి, కొత్తూరు, రామాంజనేయపురం, కొప్పరపాడు గ్రామాల్లో ప్రస్తుతం 800 ఎకరాల్లో విస్తరించి జిల్లాలోని మొదటి స్థానంలో ఉందని అధికారులు అంటున్నారు. తినడానికి వీలుగా ఉండే నల్లచెరుకు (జనగాం రకం) గడ రూ.20ల చొప్పున రాష్ట్రంలోని వ్యాపారులు చేలవద్దే కొనుగోలు చేస్తున్నారన్నారు.