News October 8, 2025
కోల్డ్రిఫ్ సిరప్కు 20 మంది పిల్లలు బలి!

మధ్యప్రదేశ్లో కోల్డ్రిఫ్ కాఫ్ సిరప్ మరణాల సంఖ్య 20కి చేరినట్లు Dy.CM రాజేంద్ర శుక్ల వెల్లడించారు. నాగ్పూర్లో ఆస్పత్రులను ఆయన సందర్శించారు. కలుషిత సిరప్ తాగి మరో ఐదుగురి కిడ్నీలు పాడైపోయాయని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతుల్లో చింద్వారాకు చెందిన వారే 17 మంది ఉన్నారని చెప్పారు. ఫీవర్, జలుబు ఉన్న పిల్లలు సిరప్ తాగడంతో వాంతులు, మూత్ర విసర్జన సమస్యలు వంటి లక్షణాలు కనిపించాయన్నారు.
Similar News
News October 8, 2025
ఆంక్షలతో జగన్ పర్యటనకు అనుమతి

AP: అనకాపల్లిలో రేపు YCP చీఫ్ జగన్ పర్యటనకు ఆంక్షలతో కూడిన అనుమతి లభించింది. ఈ విషయాన్ని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత వెల్లడించారు. వైజాగ్ ఎయిర్పోర్టు నుంచి ఎన్ఏడీ కొత్త రోడ్, వేపగుంట, సరిపల్లి జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో రావాలని సూచించారు. ట్రాఫిక్ ఏసీపీ పర్మిషన్ లేకుండా ఎలాంటి మార్పులు, హాల్ట్ చేయకూడదని పేర్కొన్నారు. జన సమీకరణకు అనుమతి లేదని, ఊరేగింపులు, రోడ్ మార్చ్లపై నిషేధం ఉందన్నారు.
News October 8, 2025
ఇంత చిన్న శ్లోకంలో ఎంత పెద్ద భావమో..

శుక్లాంబరధరం విష్ణుం, శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్, సర్వ విఘ్నోపశాంతయే||
తెల్లటి వస్త్రాలు ధరించి, విశ్వమంతా వ్యాపించినవాడా! చంద్రుని తేజస్సుతో పాటు 4 భుజాలు గలవాడా! ప్రసన్న ముఖుడిని నేను ధ్యానిస్తున్నాను. నా విఘ్నాలను తొలగించు’ అనేది ఈ శ్లోకార్థం. తెలుపు వస్త్రాలు పవిత్రతకు చిహ్నం. చతుర్భుజాలు పురుషార్థాలను సూచిస్తాయి. సర్వవ్యాపిని ధ్యానించి, కార్యసిద్ధిని కోరే అద్భుత ప్రార్థన ఇది.
News October 8, 2025
CSIR-IMMTలో 30 పోస్టులు

CSIR-ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ 30 పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. వీటిలో సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఎంఈ, ఎంటెక్, బీఈ, బీటెక్ , PhD అర్హతగల అభ్యర్థులు నవంబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్సైట్: https://www.immt.res.in/