News October 8, 2025
నేటి నుంచి ఎస్జీఎఫ్ అండర్-19 క్రీడా పోటీలు

కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో నేటి నుంచి ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-19 బాలబాలికల విభాగంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, 9న చెస్, క్యారమ్స్, బాస్కెట్బాల్, పవర్ లిఫ్టింగ్, బాల్ బ్యాడ్మింటన్, 10న బ్యాడ్మింటన్, బేస్ బాల్, సాఫ్ట్ బాల్, త్రో బాల్, 11న హ్యాండ్ బాల్, హాకీ, రోప్ స్కిప్పింగ్, రోల్ బాల్, 13న క్రికెట్, యోగా ఎంపిక పోటీలు ఉంటాయని ఎస్జీఎఫ్ కార్యదర్శి రాఘవేంద్ర మంగళవారం తెలిపారు.
Similar News
News April 3, 2026
విషాదం.. లారీ బోల్తా పడి రైతు మృతి

మంత్రాలయం మండలం రచ్చమర్రిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యాకోబు గుంటూరులో మిరపకాయలు అమ్ముకుని తిరుగు ప్రయాణంలో ఆత్మకూరు ఘాట్ వద్ద లారీ బోల్తా పడటంతో బియ్యం సంచులు మీద పడి మృతి చెందాడు. కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని పలువురు ప్రజా సంఘాలు నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.
News April 3, 2026
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం: కలెక్టర్

భూసారాన్ని పెంచడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి శిక్షణలో రైతులకు PMDS, గ్రీన్ మేన్యూర్ పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. పంటల వైవిధ్యం, ఉద్యాన పంటల సాగు, మల్లె సాగు విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు.
News April 3, 2026
ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం: కలెక్టర్

భూసారాన్ని పెంచడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి శిక్షణలో రైతులకు PMDS, గ్రీన్ మేన్యూర్ పద్ధతులపై అవగాహన కల్పించాలని సూచించారు. పంటల వైవిధ్యం, ఉద్యాన పంటల సాగు, మల్లె సాగు విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు.


