News October 8, 2025
ప్రతి శనివారం టిడ్కో ఇళ్ల కేటాయింపు: మంత్రి

AP: 2026 జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో అమృత్ 2.0 స్కీమ్లో భాగంగా పట్టణాల్లో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. గడువులోగా సంబంధిత తాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలని సూచించారు.
Similar News
News October 8, 2025
కాంతార చాప్టర్-1కు రూ.400 కోట్ల కలెక్షన్లు

గత గురువారం విడుదలైన ‘కాంతార చాప్టర్-1’ భారీ కలెక్షన్లు రాబడుతోంది. ఇప్పటివరకు రూ.400 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఈ మార్క్ అందుకున్న నాలుగో సినిమాగా (సైయారా, ఛావా, కూలీ) నిలిచింది. నెట్ కలెక్షన్లు రూ.290 కోట్లుగా ఉండొచ్చని, ఇవాళ్టితో హిందీ మార్కెట్లో రూ.100 కోట్ల నెట్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. తెలుగులో రూ.57.40 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి.
News October 8, 2025
సరైన భాగస్వామి దొరికే వరకు ఎదురుచూడటంలో తప్పులేదు: ఉపాసన

NCRB ప్రకారం భారత్లో సగం నేరాలకు వైవాహిక సమస్యలు కూడా కారణమంటున్నారు ఉపాసన. కాబట్టి పెళ్లి విషయంలో మహిళల ఆలోచనా తీరుమారాలని సూచిస్తున్నారు. భాగస్వామి ఎంపికలో సరైన నిర్ణయమే మహిళ భవిష్యత్తుకి, మంచి కుటుంబాన్ని నిర్మించడానికి కీలకమన్నారు. డబ్బు, హోదా కోసం పెళ్లి చేసుకోకూడదని, మీకు గౌరవమిస్తూ అన్ని విషయాల్లో అండగా నిలిచే వ్యక్తి కోసం ఎదురుచూడటంలో తప్పులేదని ఓ పోస్టులో పేర్కొన్నారు.
News October 8, 2025
టుడే అప్డేట్స్

* లగ్జరీ కార్ల కేసు.. దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లతో సహా చెన్నై, కొచ్చిలోని 13 ప్రాంతాల్లో ఈడీ సోదాలు
*TG: పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలు(టాయిలెట్లు, తాగునీరు, టెంట్లు) కల్పించాలని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు ఎస్ఈసీ ఆదేశం
* ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ.. దేశాభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయంపై చర్చ