News October 8, 2025
KNR: నేడే తీర్పు.. సర్వత్రా ఉత్కంఠత..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GOను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై నేడే హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం కలిపి 60 ZPTCలు, 646 MPTCలు, 1,216 GP స్థానాలున్నాయి. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా?, లేదా వ్యతిరేకంగా వస్తుందా? COMMENT.
Similar News
News October 8, 2025
KNR: RTCకి ఆదాయం.. సిబ్బంది సంబరాలు

సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీకి అత్యధిక ఆదాయం వచ్చింది. ఇందుకు గాను KNR బస్ స్టేషన్ ఆవరణలోని KNR-1 & 2 డిపోలలోని సిబ్బందికి KNR RM బి.రాజు, డిప్యూటీ RMలు భూపతి రెడ్డి, మల్లేశం ఆధ్వర్యంలో మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా RM బి.రాజు మాట్లాడుతూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, సూపర్వైజర్లను అభినందించారు.
News October 8, 2025
‘బకాయిలు చెల్లించేవరకు విద్యార్థులకు అనుమతి నిరాకరణ’

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఫీజు బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో కరీంనగర్ జిల్లాలోని పలు పాఠశాలలు విద్యార్థులను అనుమతించడం లేదు. బకాయిలు విడుదలయ్యే వరకు విద్యార్థులను అనుమతించబోమని పాఠశాలల యజమాన్యాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. దీంతో తమ పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.
News October 7, 2025
ఎన్నికల విధులు నిర్లక్ష్యం చేయవద్దు: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నోడల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి (ఎంసీసీ) అమలుపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో విధులు కేటాయించబడిన అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని సూచించారు.