News October 8, 2025

నల్ల చెరకుకు కేరాఫ్ బల్లికురవ

image

నల్లచెరుకు సాగుకు కేరాఫ్‌గా బల్లికురవ మండలం నిలుస్తోందని రైతులు అంటున్నారు. మొదట్లో 5 ఎకరాలతో మొదలైన సాగు కూకట్లపల్లి, కొత్తూరు, రామాంజనేయపురం, కొప్పరపాడు గ్రామాల్లో ప్రస్తుతం 800 ఎకరాల్లో విస్తరించి జిల్లాలోని మొదటి స్థానంలో ఉందని అధికారులు అంటున్నారు. తినడానికి వీలుగా ఉండే నల్లచెరుకు (జనగాం రకం) గడ రూ.20ల చొప్పున రాష్ట్రంలోని వ్యాపారులు చేలవద్దే కొనుగోలు చేస్తున్నారన్నారు.

Similar News

News October 8, 2025

వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ రాసుకోవాలా?

image

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండి, మబ్బుల వల్ల సూర్యకిరణాలు తక్కువగా పడుతుంటాయి. దీంతో చాలామంది ఈ కాలంలో సన్‌స్క్రీన్ రాసుకోరు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. మబ్బులున్నా కూడా సూర్యరశ్మిలోని హానికరమైన UV రేస్ భూమిని చేరుకుంటాయి. ఇవి చర్మకణాలను దెబ్బతీస్తాయి. కాబట్టి సన్‌స్క్రీన్ స్కిప్ చేయకూడదంటున్నారు. సన్‌స్క్రీన్‌ ఎంచుకొనేటప్పుడు Broad-spectrum , SPF50 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని సూచించారు.

News October 8, 2025

విశాఖ అభివృద్ధిని అడ్డుకోవాలని వైసీపీ తీర్మానించింది: గంటా

image

విశాఖలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని వైకాపా తన ఉత్తరాంధ్ర సమావేశంలో తీర్మానం చేసిందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. గతంలో తాము జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు దర్శి, సత్తెనపల్లి వంటి అనేక ప్రాంతాల్లో అనుమతులు ఇచ్చామని గుర్తుచేశారు. కానీ వైకాపా మాత్రం విశాఖ అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని విమర్శించారు.

News October 8, 2025

రెండు సిరప్‌లపై ప్రభుత్వం నిషేధం

image

TG: రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్‌లను వాడొద్దని స్పష్టం చేసింది. ఈ రెండు దగ్గు సిరప్‌లలో అత్యంత విషపూరితమైన Diethylene Glycol (DEG) ఉందని పేర్కొంది. వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్‌లో Coldrif సిరప్ వల్ల 20 మంది చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.