News October 8, 2025

ఉమ్మడి వరంగల్‌లో విష జ్వరాలతో మృత్యువాత..!

image

విషజ్వరాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. ములుగు(D) వాజేడులో నర్సింగ్ విద్యార్థిని అంజలి, నెక్కొండ(M) గుండ్రపల్లిలో చిన్నారి సహస్ర, లింగాలఘణపురం(M) మాణిక్యాపురంలో మహేష్ మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. లక్షల్లో ఖర్చు చేసి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాయి. జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Similar News

News October 8, 2025

MBUలో అక్రమ వసూళ్లు ఇలా..!

image

మోహన్ బాబు యూనివర్సిటీలో వివిధ రూపాల్లో నగదు <<17945897>>వసూళ్లు <<>>చేశారని తెలుస్తోంది. 2022-23లో ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా రూ.24,500, 23-24, 24-25లో రూ.37వేలు వసూళ్లు చేశారు. ఇలా 2022-23లో రూ.2.59 కోట్లు, 23-24లో రూ.10.65 కోట్లు, 24-25లో రూ.12.93 కోట్లు రాబట్టారు. CAMU సాప్ట్‌వేర్‌తో విద్యార్థుల అటెండెన్స్ నమోదు చేస్తున్నారు. ఇందులోనూ తప్పుడు హాజరు చూపించి ఒక్కొక్కరి నుంచి రూ.7,500 వసూళ్లు చేశారట.

News October 8, 2025

GNT: ‘ఆశాలకు ₹26 వేల కనీస వేతనం ఇవ్వాలి’

image

ఆశా వర్కర్స్‌కు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరులోని అర్బన్ హెల్త్ సెంటర్ల వద్ద ఆశా వర్కర్స్ నిరసన చేపట్టారు. ఆరేళ్లుగా జీతాలు పెరగలేదని, 5G ఫోన్‌లు ఇవ్వాలని, చనిపోయిన వారికి రూ. 20 వేలు మట్టి ఖర్చుల కోసం ఇవ్వాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

News October 8, 2025

కాకతీయుల ఆనవాళ్లకు చిహ్నం.. ఏకశిలా నగరం!

image

కాకతీయుల ఆనవాళ్లకు చిహ్నం ఓరుగల్లు. వారు నిర్మించిన చెరువులు, దేవాలయాలు కోకొల్లలు. వాటిలో ఒకటే ఏకశిలా నగరం. రాతి బండతో ఏర్పడిన ఈ ఏకశిలపై కోట నిర్మించడంతో ఈ పేరు వచ్చింది. దీన్ని రాజధాని రక్షణకు వ్యూహాత్మక స్థలంగా కాకతీయులు ఉపయోగించారు. పైనుంచి చుట్టుపక్క ప్రాంతాలన్నీ కనిపించేలా ఉండటంతో నిఘా కేంద్రంగా పనిచేసింది. గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కాలంలో ఈ కొండ రాజభవనంలా విరాజిల్లింది.