News October 8, 2025
దయచేసి మాకు పోటీగా రాకండి: గ్రూప్-3 ర్యాంకర్లు

TG: గ్రూప్-2 ఉద్యోగానికి ఎంపికైన వారు తమకు పోటీగా రావొద్దని గ్రూప్-3కి క్వాలిఫై అయిన ర్యాంకర్లు కోరారు. వెబ్ ఆప్షన్, సర్టిఫికెట్ల పరిశీలనకు దూరంగా ఉండాలని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వేడుకున్నారు. గ్రూప్3 పోస్టులకు ఎంపికైన గ్రూప్2 అభ్యర్థులు 500 మంది ఉన్నారని, అధ్యాపకులు, SIలు మరో 600 మంది ఉన్నారని తెలిపారు. వీరు కోర్టు కేసుల నేపథ్యంలో గ్రూప్3 పోస్టులను బ్యాకప్ ఆప్షన్గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 21, 2026
డియాగో గార్సియాపై ఇరాన్ దాడి.. ఖండించిన బ్రిటన్

ఇండియన్ ఓషన్లో ఉన్న US-UK మిలిటరీ బేస్ డియాగో గార్సియాపై <<19440362>>ఇరాన్ దాడిని<<>> బ్రిటన్ ఖండించింది. అలాగే గల్ఫ్ దేశాలపై దాడులను తప్పుపట్టింది. హార్ముజ్ జలసంధిని మూసేయడాన్ని తమకు, తమ మిత్ర దేశాలకు ముప్పుగా అభిప్రాయపడింది. ఈ యుద్ధంలో బ్రిటన్ నేరుగా పాల్గొనకపోయినా తమ స్థావరాలను వాడుకునేందుకు అమెరికాకు అనుమతించిన విషయం తెలిసిందే. అందుకే డియాగో గార్సియాను ఇరాన్ టార్గెట్ చేసింది.
News March 21, 2026
దాడులు ఆపండి.. ఇరాన్కు 22 దేశాల లేఖ

పశ్చిమాసియాలో 20 రోజులుగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధిని వెంటనే ఓపెన్ చేయాలంటూ 22 దేశాలు ఇరాన్కు లేఖ రాశాయి. ఈ జాబితాలో UAE, UK, బహ్రెయిన్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, జర్మనీ తదితర దేశాలున్నాయి. గల్ఫ్ రీజియన్లోని ఆయిల్, గ్యాస్ క్షేత్రాలపై దాడులను ఆపాలని కోరాయి. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నాయి.
News March 21, 2026
ఇరాన్కు వెళ్లిపోండి.. షియా ముస్లింలను అవమానించిన మునీర్

ఇటీవల జరిగిన ఓ ఉన్నతస్థాయి ఇఫ్తార్ విందులో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ షియా ముస్లింలను తీవ్రంగా అవమానించినట్లు సమాచారం. ‘మీరు ఇరాన్ను ఎక్కువగా ఇష్టపడితే అక్కడికే వెళ్లిపోండి’ అని వ్యాఖ్యానించినట్లు CNN-News18 వెల్లడించింది. షియా మతపెద్దలు, స్కాలర్లకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపింది. దీంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. కాగా ఇరాన్లో షియా, పాక్లో సున్నీ ముస్లింలు ఎక్కువ.


