News October 8, 2025

దయచేసి మాకు పోటీగా రాకండి: గ్రూప్-3 ర్యాంకర్లు

image

TG: గ్రూప్-2 ఉద్యోగానికి ఎంపికైన వారు తమకు పోటీగా రావొద్దని గ్రూప్-3కి క్వాలిఫై అయిన ర్యాంకర్లు కోరారు. వెబ్ ఆప్షన్, సర్టిఫికెట్ల పరిశీలనకు దూరంగా ఉండాలని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వేడుకున్నారు. గ్రూప్3 పోస్టులకు ఎంపికైన గ్రూప్2 అభ్యర్థులు 500 మంది ఉన్నారని, అధ్యాపకులు, SIలు మరో 600 మంది ఉన్నారని తెలిపారు. వీరు కోర్టు కేసుల నేపథ్యంలో గ్రూప్3 పోస్టులను బ్యాకప్ ఆప్షన్‌గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News October 8, 2025

వర్షాకాలంలోనూ సన్‌స్క్రీన్ రాసుకోవాలా?

image

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండి, మబ్బుల వల్ల సూర్యకిరణాలు తక్కువగా పడుతుంటాయి. దీంతో చాలామంది ఈ కాలంలో సన్‌స్క్రీన్ రాసుకోరు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. మబ్బులున్నా కూడా సూర్యరశ్మిలోని హానికరమైన UV రేస్ భూమిని చేరుకుంటాయి. ఇవి చర్మకణాలను దెబ్బతీస్తాయి. కాబట్టి సన్‌స్క్రీన్ స్కిప్ చేయకూడదంటున్నారు. సన్‌స్క్రీన్‌ ఎంచుకొనేటప్పుడు Broad-spectrum , SPF50 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని సూచించారు.

News October 8, 2025

రెండు సిరప్‌లపై ప్రభుత్వం నిషేధం

image

TG: రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్‌లను వాడొద్దని స్పష్టం చేసింది. ఈ రెండు దగ్గు సిరప్‌లలో అత్యంత విషపూరితమైన Diethylene Glycol (DEG) ఉందని పేర్కొంది. వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్‌లో Coldrif సిరప్ వల్ల 20 మంది చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

News October 8, 2025

న్యూస్ అప్‌డేట్స్ @12am

image

*తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ. కీలకమైన సాక్ష్యాలు లభించాయన్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. విచారణ అక్టోబర్ 14కు వాయిదా.
*సుప్రీంకోర్టులో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నవంబర్ 3కు వాయిదా