News October 8, 2025
నేడు..

☕TG: BCలకు 42% రిజర్వేషన్ల G.O.పై హైకోర్టులో విచారణ
☕AP: లిక్కర్ కేసు నిందితులు కసిరెడ్డి, బాలాజీ బెయిల్ పిటిషన్లపై కోర్టులో విచారణ
☕AP: డిమాండ్ల సాధనకై PHC డాక్టర్ల దీక్ష
☕AP: పిన్నెల్లి సోదరులకు ముగియనున్న SC మధ్యంతర బెయిల్
☕ మెదక్ జిల్లాలో పంటనష్ట ప్రాంతాల్లో కేంద్రబృందం పర్యటన
☕WWC: 3PMకు ఆస్ట్రేలియా Vs పాక్ మ్యాచ్
☕క్లచ్ చెస్ టోర్నీలో విశ్వనాథన్ ఆనంద్-గ్యారీ కాస్పరోవ్ ఢీ
Similar News
News October 8, 2025
హైకోర్టులో తిరిగి ప్రారంభమైన విచారణ

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టులో విచారణ తిరిగి ప్రారంభమైంది. రిజర్వేషన్ల అమలు జీవోను వ్యతిరేకిస్తూ రెడ్డి జాగృతి న్యాయవాది మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. కొన్ని ఇంప్లీడ్ పిటిషన్లకు నంబరింగ్ ఇవ్వలేదని మరో న్యాయవాది విచారణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ, న్యాయ వర్గాలు చెబుతున్నాయి.
News October 8, 2025
వర్షాకాలంలోనూ సన్స్క్రీన్ రాసుకోవాలా?

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండి, మబ్బుల వల్ల సూర్యకిరణాలు తక్కువగా పడుతుంటాయి. దీంతో చాలామంది ఈ కాలంలో సన్స్క్రీన్ రాసుకోరు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. మబ్బులున్నా కూడా సూర్యరశ్మిలోని హానికరమైన UV రేస్ భూమిని చేరుకుంటాయి. ఇవి చర్మకణాలను దెబ్బతీస్తాయి. కాబట్టి సన్స్క్రీన్ స్కిప్ చేయకూడదంటున్నారు. సన్స్క్రీన్ ఎంచుకొనేటప్పుడు Broad-spectrum , SPF50 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని సూచించారు.
News October 8, 2025
రెండు సిరప్లపై ప్రభుత్వం నిషేధం

TG: రాష్ట్రంలో రెండు దగ్గు మందులను ప్రభుత్వం నిషేధించింది. Relife CF, Respifresh-TR సిరప్లను వాడొద్దని స్పష్టం చేసింది. ఈ రెండు దగ్గు సిరప్లలో అత్యంత విషపూరితమైన Diethylene Glycol (DEG) ఉందని పేర్కొంది. వీటి వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్లో Coldrif సిరప్ వల్ల 20 మంది చిన్నారులు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.