News October 8, 2025

భద్రాద్రి జిల్లాలో కృత్రిమ బీచ్ ఏర్పాటు..!

image

భద్రాద్రి జిల్లాలో కృత్రిమ బీచ్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మణుగూరు మండలం పగిడేరులో వేడినీటి ఊటల ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఇక్కడ ఊబికి వచ్చే నీటిని రైతులు ఉపయోగించడం లేదు. మడుల్లో నిల్వ చేసి చల్లారాక పొలాలకు పారిస్తున్నారు. ఆ మడుల వద్ద ఇసుక రాశులను పోసి కృత్రిమ బీచ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. బీచ్‌ ఏర్పాటుకు సింగరేణి సహకారం అందించనుంది.

Similar News

News March 21, 2026

ఎచ్చెర్ల: పరీక్షలు రాస్తారు.. ఫలితాలు మాత్రం ఎప్పటికో..!

image

అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పరీక్షల ఫలితాలు విడుదలలో తీవ్ర జాప్యంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహణ తర్వాత కనీసం 30 నుంచి 45రోజుల వరకు ఫలితాలు వెల్లడికి పడుతోందని విద్యార్థులు వాపోతున్నారు. రీ వాల్యుయేషన్ ఫలితాలు రావడంలో, సర్టిఫికెట్స్ అందజేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో ఆందోళన చెందుతున్నామని అంటున్నారు.

News March 21, 2026

HYD: భట్టి కుమారుడి రిసెప్షన్‌లో సీఎం దంపతులు

image

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కుమారుడు మల్లు సూర్య విక్రమాదిత్య- సాక్షి వివాహ రిసెప్షన్ HYD శివారులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను రేవంత్ రెడ్డి దంపతులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నేతలు, సినీ వర్గాల ప్రముఖులు హాజరయ్యారు.

News March 21, 2026

అనంత: స్వగ్రామానికి మాజీ MLA భౌతికకాయం తరలింపు

image

కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అనంతపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లికి తరలించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. పూలమాలలు వేసి సంతాపం తెలిపారు.