News October 8, 2025
KNR: డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 2025- 26 విద్యాసంవత్సరానికి DMIT, DANS డిప్లొమా కోర్సులకు అర్హులైన MPC, Bi.PC అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28లోపు కళాశాలలో అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించాలని, మరిన్ని వివరాలకు కళాశాల పోర్టల్ను సందర్శించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. WEBSITE: http://www.gmknr.com. SHARE IT.
Similar News
News October 8, 2025
నారద భక్తి సూత్రాలు – 4

‘యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధోభవతి, అమృతో భవతి, తృప్తో భవతి’ నారద భక్తి సూత్రాల్లో ఇది నాలుగవది. దీనర్థం.. నిష్కల్మషమైన భక్తిని పొందిన మానవుడు సిద్ధుడు అవుతాడు. వారికి మృత్యు భయం ఉండదు. జీవితంలో మరేదీ అవసరం లేదన్నట్లు శాశ్వతమైన తృప్తిని పొందుతాడు. ఈ భక్తి లభించడం వల్ల సాధన పూర్తై, అన్ని కోరికలు తీరిన అనుభూతి కలుగుతుంది. అమరత్వం లభిస్తుంది. సమస్త సుఖాలకు మూలం, ముక్తికి మార్గం ఈ భక్తే. <<-se>>#NBS<<>>
News October 8, 2025
PDPL: ‘నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలివే’

ZPTC, MPTC మొదటి విడత ఎన్నికల నామినేషన్ దాఖలు ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కానుంది. అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు, ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల డిపాజిట్ రసీదు, మూడు పాస్పోర్ట్ ఫొటోలు సమర్పించాలి. పార్టీ అభ్యర్థులైతే తప్పనిసరిగా Bఫామ్ జతచేయాలి. రిజర్వేషన్ స్థానాలకు పోటీ చేసేవారు కుల ధృవపత్రంపై గెజిటెడ్ సంతకం చేయించి అటాచ్ చేయాలి. ఎన్నికల వ్యయం నిర్వహణకు కొత్త బ్యాంకు ఖాతా ROకు సమర్పించాలి.
News October 8, 2025
పెద్దపల్లి: BONUS ఎప్పుడు..?

యాసంగి సీజన్కి సంబంధించి సాగుచేసిన సన్నధాన్యానికి రూ.500 బోనస్ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. సాధారణంగా యాసంగిలో సన్నధాన్యం సాగుచేయని పెద్దపల్లి రైతులు బోనస్ ఆశతో గత యాసంగిలో జిల్లాలో 73 వేల ఎకరాల్లో సన్నధాన్యం పండించారు. వానకాలం పంట కోతకు వచ్చినా యాసంగి బోనస్ రాకపోవడంతో ఇస్తారో.. ఇవ్వరో అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బోనస్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.