News October 8, 2025

నేడు ‘సంజీవని’ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం

image

AP: CM చంద్రబాబు ఇవాళ కుప్పంలో ‘సంజీవని’ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా 30 ఏళ్లు దాటిన వారికి రక్త పరీక్షలు నిర్వహిస్తారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే టెస్టులు చేయడం వల్ల ముందే గుర్తించవచ్చని భావిస్తున్నారు. ఈ రోజు కుప్పంలో, ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో, అనంతరం మిగతా జిల్లాల్లో ఈ స్కీమ్‌ను అమలు చేయనున్నారు. 104 వాహనాల్లోనూ టెస్టులు చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు.

Similar News

News February 18, 2026

కూరగాయలు తాజాగా ఉండాలంటే?

image

కూరగాయలు తాజాగా ఉండటానికి జపనీయులు కాటన్, మస్లిన్ వస్త్రంలో చుట్టేస్తారు. ఆకుకూరలను కాస్త తడిపిన క్లాత్‌లో చుట్టి ఫ్రిడ్జ్‌లో ఉంచుతారు. అలాగే ఫ్రిడ్జ్‌లో కూరగాయలు పెట్టాలి అనుకున్నప్పుడు వాటిని శుభ్రంగా కడిగి, తుడిచి పొడిగా ఉన్నప్పుడే పెట్టాలి. పండిపోయినవి త్వరగా వాడేయాలి. లేదంటే వాటి ప్రభావం వేరే కూరగాయలపై పడుతుంది. అలాగే టైట్‌ కవర్‌లో కూరగాయలు పెట్టడం వల్ల తర్వరగా పాడైపోతాయి.

News February 18, 2026

డిన్నర్ ఎప్పుడు చేస్తున్నారు?

image

నిద్ర పోయే 3 గంటల ముందే భోజనం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల రక్తపోటు 3.5%, హార్ట్ బీట్ 5% తగ్గుతాయని చెబుతున్నారు. ‘ఆలస్యంగా తినడం వల్ల శరీరం జీర్ణక్రియలోనే నిమగ్నమైపోతుంది. ‘మెదడు క్లీనింగ్’ ప్రాసెస్‌కూ ఆటంకం ఏర్పడుతుంది. ఆహారం మార్చకుండా, కేవలం సమయం మార్చడం ద్వారా మీ ఆయుష్షును పెంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇలా చేయండి’ అని తెలిపారు. share it

News February 18, 2026

ఆయుష్ మంత్రిత్వశాఖలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

న్యూఢిల్లీలోని <>ఆయుష్<<>> మంత్రిత్వశాఖలో 7 కన్సల్టెంట్, లీగల్ కన్సల్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి LLB, BE/BTech, ME/MTech అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 64ఏళ్లు. వెబ్‌సైట్: https://ayush.gov.in