News October 8, 2025

ములుగు: ఆలోచిస్తారా..? లొంగిపోతారా..?

image

మావోయిస్టులకు సేఫ్ జోన్‌గా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. సీసీ కమిటీ సబ్యులైన నంబాల కేశవరావు, సుధాకర్, బాలకృష్ణ, రామచంద్రారెడ్డి, గాజర్ల రవి వంటి ఆగ్రనేతలు చనిపోగా.. మరికొందరు లొంగిపోయిన విషయం తెలిసిందే. పోలీసుల నిర్బంధం పెరగడంతో పాటు సుమారు 100 క్యాంపులను ఏర్పాటు చేయడం మావోయిస్టులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఆయుధాలు వదిలేస్తారా.? లొంగిపోతారా.? అనే చర్చ మొదలైంది.

Similar News

News March 5, 2026

నిర్మల్: ఇంటర్ పరీక్షలు.. 220 మంది గైర్హాజరు

image

నిర్మల్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర గణితం, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఐఈవో పరశురాం తెలిపారు. మొత్తం 6,358 మంది విద్యార్థులకు గాను 6,138 మంది హాజరుకాగా, 220 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు నిశ్చింతగా పరీక్షలు రాశారని ఆయన పేర్కొన్నారు.

News March 5, 2026

సిద్దిపేట: ప్రజా పాలన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కే.హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించిందన్నారు.

News March 5, 2026

నామినేషన్ వేసిన సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి

image

తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడిన వారిద్దరూ తమకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి, ఏఐసీసీ పెద్దలకు, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడతానని సింఘ్వీ వ్యాఖ్యానించారు.