News April 7, 2024

ప.గో.: ఎన్నికల సిత్రం.. గారెలు, బజ్జీలు వేసిన MLA అభ్యర్థి

image

రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని కొవ్వూరు కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని మలకపల్లిలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ఆయన ఓ టిఫిన్ సెంటర్‌లో గారెలు, బజ్జీలు వేశారు.

Similar News

News October 4, 2025

గోనె సంచులను అందించేందుకు చర్యలు: జేసీ

image

మిల్లర్ల నుండి నాణ్యమైన గోనె సంచులను సేకరించి రైతులకు అందించేందుకు ఇప్పటి నుండే చర్యలు చేపట్టాలని జేసి రాహుల్ అన్నారు. ఖరీఫ్ సీజన్ ధాన్యం సేకరణకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్ల మండలాల వారీగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, వివాదాలకు తావు లేకుండా అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జేసి అన్నారు.

News October 3, 2025

తణుకు: సురేశ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి.. హత్యగా కేసుగా మార్పు

image

అనుమానాస్పద స్థితిలో అదృశ్యమై హత్యకు గురైన మడుగుల సురేష్ మృతదేహానికి పోస్టుమార్టం శుక్రవారం పూర్తి చేశారు. తణుకులో న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుతో పాటు మరో నలుగురు చేతిలో హతమైనట్లుగా పోలీసులు భావిస్తున్న సురేష్ మృతదేహాన్ని సఖినేటిపల్లి గోదావరి తీరంలో గురువారం గుర్తించిన విషయం తెలిసిందే. శుక్రవారం రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి చేసి హత్య కేసుగా మార్పు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 3, 2025

అత్యంత కిరాతకంగా చంపి… గోనె సంచిలో కుక్కి..!

image

తణుకులో అదృశ్యమై తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లిలో శవమై తేలిన మడుగుల సురేశ్ వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయవాది తిర్రే సత్యనారాయణరాజుతో పాటు మరో నలుగురు సురేశ్‌ను హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి గోనె సంచిలో కుక్కి గోదావరిలో పడవేసినట్లు తెలుస్తోంది. న్యాయవాది సోదరుడి కారులో మృతదేహాన్ని తరలించారనే అనుమానంతో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.