News October 8, 2025

విజయవాడ పశ్చిమ బైపాస్‌ను వేధిస్తున్న టవర్ల సమస్య

image

97% మేర పూర్తైన పశ్చిమ బైపాస్‌ పనులకు అపరిష్కృతంగా ఉన్న టవర్ల సమస్య ఆటంకంగా మారింది. రహదారి వెళ్లే మార్గంలోని హైటెన్షన్ ట్రాన్స్‌మిషన్ టవర్ల ఎత్తు పెంచితే మిగతా పనులు పూర్తి కానుండగా.. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అనుమతులు వస్తే మిగతా పనులు పూర్తై రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజానీకం కోరుతున్నారు.

Similar News

News October 8, 2025

ఆద‌ర్శ ఉపాధ్యాయులుగా నిలిచేందుకు పోటీప‌డి ప‌నిచేయాలి: కలెక్టర్

image

ఆద‌ర్శ ఉపాధ్యాయులుగా నిలిచేందుకు, విద్యార్థుల‌ను ఉత్త‌మంగా తీర్చిదిద్దేందుకు పోటీప‌డి ప‌నిచేయాల‌ని ఇటీవ‌ల డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయలను ఉద్దేశించి క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అన్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్య‌ర్థులకు మ‌ధురువాడలో ఏర్పాటు చేసిన ఇండక్ష‌న్ ట్రైనింగ్ శిబిరాన్ని విశాఖ క‌లెక్ట‌ర్ బుధవారం సంద‌ర్శించారు. క‌ల‌కాలం విద్యార్థులు మిమ్మ‌ల్ని గుర్తుంచుకునేలా వినూత్న రీతిలో బోధించాల‌ని సూచించారు.

News October 8, 2025

ఏడు కొండలు ఏడు శక్తి కేంద్రాలు – వృషభాద్రి

image

తిరుమల కొండల్లో ఐదవది ‘వృషభాద్రి’. సాధన చేసే భక్తుడు ఏకాగ్రతతో ధ్యానించినప్పుడు, అతని కుండలిని శక్తి విశుద్ధ చక్రాన్ని చేరుకుంటుంది. అంటే.. దాదాపు 80% ఆధ్యాత్మిక ప్రయాణం పూర్తైనట్లే. ఈ దశలో సంసార బంధాలన్నీ తెగిపోయి, మనస్సు బంధాలు లేని వృషభం(ఎద్దు) వలె కేవలం పరమాత్మ వైపే వేగంగా పరుగులు తీస్తుంది. ఈ శక్తిమంతమైన భావాన్ని సూచిస్తూనే ఈ కొండకు ‘వృషభాద్రి’ అనే దివ్య నామం వచ్చింది. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News October 8, 2025

సిరిసిల్ల: సన్నవడ్ల BONUSపై ఆశలు గల్లంతేనా..?

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్న వడ్లకు బోనస్ వస్తుందనే ఆశలు ఆవిరవుతున్నాయని పలువురు రైతన్నలు పేర్కొన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో రైతన్నలు సన్న వడ్లను సాగు చేశారు. గత సీజన్లో ప్రభుత్వం 10 వేల క్వింటాళ్లకుపైగా సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటివరకు బోనస్ రాకపోవడంతో రైతులు దిగాలుగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో కూడా సన్నాలను సాగు చేశారు.