News October 8, 2025
గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

2027 జూలైలో జరగనున్న పవిత్ర గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంగళవారం పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు తన కార్యాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి పరిసర గ్రామాల్లోని ఆలయాలు, ముఖ్యంగా క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు అవసరమైన అంచనాలు త్వరగా తయారు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. పుష్కరాల కోసం పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
Similar News
News March 21, 2026
ప.గో: అలర్ట్.. దరఖాస్తుల ఆహ్వానం

ప.గో జిల్లాలో పర్యాటక రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో టూరిజంపై మాట్లాడిన ఆమె, టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి ఉన్న ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగలవారు ceo-apta@ap.gov.in మెయిల్ ఐడీకి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 21, 2026
పశ్చిమలో ఆసక్తికర చర్చ..!

2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో మహిళల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, టీడీపీ పార్టీలు మహిళలకు అవకాశం కల్పించలేదు. మహిళా బిల్లు అమలులోకి వస్తే జిల్లాలో మహిళలకు ఎన్ని సీట్లు దక్కుతాయి, ఏయే స్థానాలను వారికి రిజర్వ్ చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
News March 21, 2026
పశ్చిమలో ఆసక్తికర చర్చ..!

2029 సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ చట్టం అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటంతో మహిళల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, టీడీపీ పార్టీలు మహిళలకు అవకాశం కల్పించలేదు. మహిళా బిల్లు అమలులోకి వస్తే జిల్లాలో మహిళలకు ఎన్ని సీట్లు దక్కుతాయి, ఏయే స్థానాలను వారికి రిజర్వ్ చేస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.


