News October 8, 2025

మందులపై పన్ను రద్దు.. ప్రజలకు ఊరట: జేసీ

image

భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలు ప్రజల ఆరోగ్యానికి, కుటుంబ భద్రతకు మేలు చేసే విధంగా, సరళమైన, అందుబాటు ధరల్లో మార్పులకు శ్రీకారం చుట్టాయని జేసీ వై.మేఘ స్వరూప్ బుధవారం తెలిపారు. 2017లో అమలులోకి వచ్చిన జీఎస్టీ వ్యవస్థలో ఈ సవరణలు ప్రజలకు నేరుగా లాభం చేకూర్చే విధంగా 2.0 వెర్షన్ రూపుదిద్దుకుందని, ముఖ్యంగా మందులు, వైద్య సేవలు మరింత చౌకగా మారాయని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 3, 2026

తూర్పుగోదావరి జిల్లాకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానం

image

రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(PHC/UPHC) సేవలలో తూ.గో. జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు DMHO కె.వెంకటేశ్వరరావు ప్రకటించారు. శుక్రవారం బొమ్మూరులోని కార్యాలయం వద్ద సిబ్బందితో కలిసి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల సానుకూల అభిప్రాయం ఫిబ్రవరిలో 74.8\% ఉండగా, మార్చిలో అది 77.8%కి పెరిగిందని ఆయన తెలిపారు. మెరుగైన వైద్య సేవలు అందించడం వల్లే ఈ ఘనత సాధ్యమైందని ఆయన కొనియాడారు.

News April 3, 2026

తూ.గో: పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామకం

image

తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ కీర్తి చేకూరి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీపీఓ వి.శాంతమణి అధికారుల జాబితాను విడుదల చేశారు. నియమితులైన అధికారులు తక్షణమే బాధ్యతలు స్వీకరించి గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. పాలనలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News April 3, 2026

రాజమండ్రిలో 4న జాబ్ మేళా

image

రాజమండ్రి కలెక్టరేట్ వద్ద గల వికాస కార్యాలయంలో ఈనెల 4వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. టెన్త్ నుంచి పీజీ వరకు చదివిన 35 ఏళ్లలోపు అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. పలు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు వికాస కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.