News October 8, 2025
రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధిస్తాం: ఉత్తమ్

తెలంగాణలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరి దిగుబడి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 67.57 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, దీని నుంచి 1.48 కోట్ల టన్నుల ధాన్యం పండుతుందని తెలిపారు. 90.46 లక్షల టన్నుల సన్నాలు, 57.84 లక్షల టన్నుల దొడ్డురకం ధాన్యం పంట చేతికొస్తుందని చెప్పారు. క్వింటాల్ సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని.. ప్రభుత్వం 80 లక్షల టన్నుల ధాన్యం కొంటుందన్నారు.
Similar News
News October 8, 2025
మహిళల్లోనే డిప్రెషన్ అధికం.. కారణమిదే!

సాధారణంగా పురుషులతో పోల్చితే మహిళల్లో డిప్రెషన్ రెట్టింపు ఉంటుంది. ఇందుకు జీన్స్(జన్యువులు) కారణమని తాజా అధ్యయనం తెలిపింది. పురుషుల కంటే మహిళల్లో 6,000 జీన్ వేరియంట్స్ అదనంగా ఉంటాయని ‘నేచర్ కమ్యూనికేషన్స్’లో పబ్లిష్ అయిన స్టడీ పేర్కొంది. జనరిక్ ఫ్యాక్టర్స్ వల్లే ఉమెన్స్లో డిప్రెషన్ రిస్క్ పెరుగుతుందని వెల్లడించింది. ఈ జీన్ వేరియంట్స్ వారసత్వంగా లేదా సహజంగా కూడా ఏర్పడతాయంది.
News October 8, 2025
AP న్యూస్ అప్డేట్స్

* అమరావతిలో CRDA ప్రాజెక్టు కార్యాలయాన్ని ఈనెల 13న 9.54AMకు ప్రారంభించనున్న CM చంద్రబాబు
* లిక్కర్ స్కాం కేసు: MP మిథున్ రెడ్డి పాస్పోర్ట్ తిరిగి ఇవ్వాలని సిట్కు ACB కోర్టు ఆదేశం.. US జనరల్ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లేందుకు పాస్పోర్ట్ ఇప్పించాలని కోరిన MP
* 21 మందితో గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ సలహా కమిటీని నియమించిన ప్రభుత్వం
* రాష్ట్రంలో 274 రోడ్ల మరమ్మతులకు రూ.1,000 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
News October 8, 2025
PCOSకి చెక్ పెట్టే చియా సీడ్స్

ప్రస్తుతకాలంలో చాలామందిని బాధించే సమస్య PCOS. దీనివల్ల బరువు పెరగడం, పీరియడ్స్ సరిగా రాకపోవడంలాంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే PCOSకి చియాసీడ్స్ పరిష్కారం చూపుతాయంటున్నారు నిపుణులు. వీటిలో పీచు అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను నెమ్మది చేసి, చక్కెర శోషణను తగ్గిస్తాయి. దీనివల్ల రక్తంలో షుగర్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. బరువును తగ్గిస్తుంది.