News October 8, 2025

వరంగల్: భారీగా తగ్గిన పలికాయ ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి చిరుధాన్యాలు నేడు తరలిరాగా ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు(బిల్టీ) నిన్న రూ.2,140 ధర పలకగా ఈరోజు సైతం అదే ధర పలికింది. అలాగే, సూక పల్లికాయకు కూడా నిన్నటి లాగే రూ.6,610 ధర వచ్చింది. పచ్చి పల్లికాయకు మంగళవారం రూ.4,710 ధర పలకగా.. ఈరోజు భారీగా పడిపోయి రూ.4100 అయినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.

Similar News

News October 8, 2025

అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

జిల్లాలో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్, గర్ల్ చైల్డ్ డే, చెత్త సేకరణ, తల్లికి వందనం, పీఎం సూర్య ఘర్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో చర్చించారు. ప్రతి అధికారి తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు.

News October 8, 2025

HYD: వాటర్ ట్యాంకర్లు ‘మాయం’.. చేయలేరిక

image

నీటి ట్యాంకర్ల దారి మళ్లింపులు, అక్రమ బిల్లింగ్‌లపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేందుకు HMWSSB ఆటోమేటిక్ వెహికల్ ట్రాకింగ్ సిస్టం (AVTS) తీసుకొచ్చింది. యాప్‌లో లైవ్ ట్రాకింగ్‌తో ట్యాంకర్లు ఎక్కడున్నాయో తెలుసుకోవచ్చు. ట్రిప్, బిల్లు డిజిటల్‌గా రికార్డ్ అవ్వడంతో అక్రమాలకు తావుండదు. వాహనం ఆలస్యమైనా అధికారులకు అలర్ట్‌లు వెళ్తాయి. ఈ అప్‌గ్రేడ్‌తో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా పారదర్శకమైన సేవలు అందుతాయి.

News October 8, 2025

హైకోర్టు నుంచి సీఎం ఇంటికి మంత్రులు, ఏజీ

image

TG: BC రిజర్వేషన్ల అంశం హైకోర్టులో తేలకపోవడంతో CM రేవంత్ అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టు నుంచి AG, లాయర్లు, మంత్రులను తన నివాసానికి రావాలని సూచించారు. రేపు కోర్టులో వాదనలు, ఎలాంటి తీర్పు ఉండబోతుందనే తదితర అంశాలను చర్చించనున్నారు. అటు విచారణ వాయిదా పడటంతో SEC నోటిఫికేషన్‌పై న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది. మరోవైపు కోర్టు ప్రాంగణంలోనే ఏజీతో మంత్రుల బృందం సమావేశమైంది.