News October 8, 2025
GNT: ‘ఆశాలకు ₹26 వేల కనీస వేతనం ఇవ్వాలి’

ఆశా వర్కర్స్కు నెలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని, అన్ని రకాల సెలవులు ఇవ్వాలని యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరులోని అర్బన్ హెల్త్ సెంటర్ల వద్ద ఆశా వర్కర్స్ నిరసన చేపట్టారు. ఆరేళ్లుగా జీతాలు పెరగలేదని, 5G ఫోన్లు ఇవ్వాలని, చనిపోయిన వారికి రూ. 20 వేలు మట్టి ఖర్చుల కోసం ఇవ్వాలని యూనియన్ గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Similar News
News October 8, 2025
GNT: మిర్చి యార్డులో 41,648 మిర్చి టిక్కీల అమ్మకం

గుంటూరు మిర్చి యార్డుకు మంగళవారం 43,284 మిర్చి టిక్కీలు విక్రయానికి రాగా ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 41,648 అమ్మకం జరిగినట్లు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ఇంకా యార్డు ఆవరణలో 7,909 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయి.
News October 7, 2025
అంబేడ్కర్ విగ్రహ ధ్వంసం వైసీపీ పనే: ఎమ్మెల్యే నక్కా

అంబేడ్కర్ విగ్రహాన్ని వైసీపీనే ధ్వంసం చేసి, ప్రభుత్వంపై బురద జల్లేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ఆరోపించారు. మంగళగిరిలో ఆయన మాట్లాడారు. దళితులంటే జగన్కు ఎందుకు అంత చిన్నచూపని ఆయన ప్రశ్నించారు. దళితుడైన సింగయ్యపై కారు ఎక్కించి చంపిన క్రూర స్వభావి జగన్ అన్నారు. రాజ్యాంగాన్ని లెక్కచేయని వైసీపీని రాష్ట్రం నుంచి బాయికాట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
News October 7, 2025
కల్తీ మద్యానికి కర్త, కర్మ, క్రియ అంతా జగనే: పీతల సుజాత

పురాణాల్లో దేవుళ్లు మంచి పనులు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడినట్టు, సీఎం చంద్రబాబు మంచి పనులు చేస్తుంటే జగన్ అడ్డుపడుతున్నాడని ఏపీ డబ్ల్యూసీఎఫ్సీ ఛైర్మన్ పీతల సుజాత మండిపడ్డారు. మంగళవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళల అభ్యున్నతికి టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.