News October 8, 2025

MBUలో అక్రమ వసూళ్లు ఇలా..!

image

మోహన్ బాబు యూనివర్సిటీలో వివిధ రూపాల్లో నగదు <<17945897>>వసూళ్లు <<>>చేశారని తెలుస్తోంది. 2022-23లో ఒక్కో విద్యార్థి నుంచి అదనంగా రూ.24,500, 23-24, 24-25లో రూ.37వేలు వసూళ్లు చేశారు. ఇలా 2022-23లో రూ.2.59 కోట్లు, 23-24లో రూ.10.65 కోట్లు, 24-25లో రూ.12.93 కోట్లు రాబట్టారు. CAMU సాప్ట్‌వేర్‌తో విద్యార్థుల అటెండెన్స్ నమోదు చేస్తున్నారు. ఇందులోనూ తప్పుడు హాజరు చూపించి ఒక్కొక్కరి నుంచి రూ.7,500 వసూళ్లు చేశారట.

Similar News

News March 20, 2026

కడప: Way2News ఎఫెక్ట్.. ప్రొక్యూర్‌మెంట్ సెంటర్లలో దోపిడీకి తెర.!

image

కడప జిల్లాలో మార్క్‌ఫెడ్ 21 పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటిని DCMS నిర్వహిస్తోంది. ఇక్కడి ఇన్‌ఛార్జ్‌లు రైతుల నుంచి బస్తాకు రూ.150-200లు దోపిడీ చేస్తున్నారు. దీనిపై Way2Newలో వీడియోలతో సహా వరుస కథనాలు ప్రచురించింది. దీంతో శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రొక్యూర్‌మెంట్ కేంద్రాల్లో క్వింటాలకు రూ.75లు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు.

News March 20, 2026

NZB జిల్లా ప్రజలకు కలెక్టర్ రంజాన్ శుభాకాంక్షలు

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నియమ నిష్ఠలతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు కొనసాగించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. శనివారం నాటి ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ ను కూడా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు.

News March 20, 2026

NZB: గోదావరి పుష్కరాల కోసం రూ. 500 కోట్ల ప్రతిపాదన

image

రాష్ట్రంలో 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నేటి రాష్ట్ర బడ్జెట్లో రూ.500 కోట్లను ప్రతిపాదించారు. ఈ నిధులతో NZB జిల్లాలోని కందకుర్తితో పాటు TGలోని బాసర, ధర్మపురి, కాలేశ్వరం, భద్రాచలం ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పించి కుంభమేళా తరహా పుష్కరాలు జరుపనున్నారు. ఈ ఏర్పాట్లపై ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సమీక్ష జరిపారు.