News October 8, 2025

రాజారాంపల్లి వారసంతలో అధిక వసూళ్లు..!

image

ఎండపల్లి మం. రాజారాంపల్లి వారసంత గుత్తేదారులకు వరంగా మారింది. కూరగాయల దుకాణ రుసుము రూ.20 వసూలు చేయాల్సి ఉండగా రూ.50 వసూలు చేస్తున్నారు. దీనిపై చిరువ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఉమ్మడి KNRలో పేరుగాంచిన రాజారాంపల్లి పశువుల వారసంత ఈసారి నిర్వహించిన వేలం పాటలో రూ.10 లక్షలకు తీన్బార్ అవ్వడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మీ ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమస్యనే ఉంటే కామెంట్ చేయండి.

Similar News

News March 11, 2026

ఏలూరు జిల్లాలో కావూరి ప్రస్థానం ఇదే..!

image

ఏలూరు మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు మృతి పట్ల పలువురు నాయకుడు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నాయకులు తెలిపిన వివరాలు ప్రకారం.. 1984,1989లో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఎంపీగా పనిచేశారు. 2004, 2009లో ఏలూరు ఎంపీగా పనిచేశారు. 2013లో కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేశారు. ఏలూరు జిల్లాలోని గ్రామాలలో సైతం పర్యటించి వారి సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించి, అభివృద్ధి బాటలో నడిపించిన వ్యక్తి అని కొనియాడారు.

News March 11, 2026

సర్‌ప్రైజింగ్.. రోడ్డుపై గుంత వల్ల దక్కిన ప్రాణం!

image

UPకి చెందిన వినీత శుక్లా(50) మరణం అంచులకు చేరి తిరిగి ప్రాణాలతో బయటపడ్డారు. డాక్టర్లు ఆమెను ‘బ్రెయిన్ డెడ్’గా ప్రకటించడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఇంటికి తీసుకెళ్తున్నారు. NH-74పై ఉన్న ఓ పెద్ద గుంత వల్ల వాహనం తీవ్ర కుదుపునకు లోనైంది. దాంతో ఆమెలో మళ్లీ చలనం మొదలై శ్వాస తీసుకోవడం ప్రారంభించారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆమె కోలుకుని ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.

News March 11, 2026

విజయవాడలో మాజీ ఎంపీ సురేశ్‌పై ఛీటింగ్ కేసు నమోదు

image

కాకినాడకు చెందిన ఓ ట్రస్ట్ రెన్యూవల్ వ్యవహారంలో మాజీ ఎంపీ నందిగం సురేశ్ మోసం చేసారంటూ సూర్యారావుపేట పోలీసులను బాధితులు ఆశ్రయించారు. ట్రస్ట్ రెన్యూవల్ చేయిస్తానంటూ రూ.25 లక్షలు తీసుకున్న సురేశ్ ఆ పని చేయించలేదంటూ బాధితులు పోలీసులకు విన్నవించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు సురేశ్‌పై నేర శిక్షాస్మృతి ప్రకారం కేసు నమోదు చేసినట్లు తాజాగా సమాచారం వెలువడింది.