News October 8, 2025
NLG: పత్తి కొనుగోళ్లకు సమాయత్తం

పత్తి కొనుగోళ్లకు నల్గొండ జిల్లా అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ నెల 21 నుంచి కొనుగోళ్లు చేపట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఇప్పటికే సీసీఐ, మార్కెటింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిన్నింగ్ వ్యాపారులు, CCI మధ్య నిబంధనలపై ఒప్పందం కుదరడంతో సంక్షోభం తొలగిపోయింది. జిల్లాలో ఈ సీజన్లో 5.64 లక్షల ఎకరాలకు పైగా పత్తి సాగైంది.
Similar News
News March 26, 2026
NLG: వాతావరణ మార్పులతో మామిడి రైతుకు దెబ్బ

జిల్లాలో మారిన వాతావరణ పరిస్థితులు మామిడి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండల తీవ్రతకు తోటల్లో పూత, పిందె రాలిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లావ్యాప్తంగా సుమారు 20 వేల ఎకరాల్లో సాగవుతున్న మామిడికి ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ప్రకృతి వైపరీత్యంతో పెట్టుబడులు కూడా దక్కవమోనని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News March 26, 2026
నాగార్జునసాగర్: క్యాంటీన్ లేక టూరిస్టుల అవస్థలు

విజయవిహార్ వద్ద కనీస క్యాంటీన్ సౌకర్యం లేకపోవడంతో సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు తాగునీరు, తినుబండారాలు దొరకక ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా కుటుంబాలతో వచ్చే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సంబంధిత పర్యాటక శాఖ అధికారులు స్పందించి, వెంటనే అక్కడ క్యాంటీన్ ఏర్పాటు చేసి కనీస వసతులు కల్పించాలని పర్యాటకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
News March 26, 2026
NLG: వానాకాలం సాగుకు ‘కార్యాచరణ’ సిద్ధం!

రాబోయే వానాకాలం సీజన్కు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ యాక్షన్ ప్లాన్ను ప్రభుత్వానికి నివేదించింది. జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం, ఎరువుల అవసరం వంటి అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసిన అధికారులు, ఈసారి రికార్డు స్థాయి సాగును అంచనా వేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లావ్యాప్తంగా మొత్తం 12.02 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. సింహభాగం వరి, పత్తి పంటలదే కావడం విశేషం.


